TS News: సంపాదన మద్యంపాలు.. సంసారం వీధిపాలు!
రోజుకు సుమారు రూ.82 కోట్లు. గడచిన ఏడాది రాష్ట్రంలో మందుబాబులు సగటున చేసిన ఖర్చు ఇది. 2021 డిసెంబరు 31, 2022 జనవరి ఒకటో తేదీల్లో.. రూ. 248.05 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. అంటే రోజుకు రూ. 124 కోట్ల చొప్పున..
నానాటికీ పెరుగుతున్న మద్యపాన వ్యసనం
ఏడాదిలోనే రూ.30 వేల కోట్ల అమ్మకాలు
బెల్ట్షాపుల్లో పెరిగిన విక్రయాలతో అనర్థాలు
ఈనాడు - హైదరాబాద్
రోజుకు సుమారు రూ.82 కోట్లు. గడచిన ఏడాది రాష్ట్రంలో మందుబాబులు సగటున చేసిన ఖర్చు ఇది. 2021 డిసెంబరు 31, 2022 జనవరి ఒకటో తేదీల్లో.. రూ. 248.05 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. అంటే రోజుకు రూ. 124 కోట్ల చొప్పున.. గత ఏడాది రోజువారీ సగటును ఈ రెండు రోజుల విక్రయాలు అధిగమించాయన్నమాట. ఏడాది చివరి అయిదు రోజుల్లోనే రూ. 902 కోట్ల మేర మద్యాన్ని మందుబాబులు తాగేశారు. సంవత్సరమంతా కలిపితే రూ. 30 వేల కోట్ల విక్రయాలు నమోదైనట్లు అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయి. మద్యపాన వ్యసనం పెరుగుతోందనడానికి ఈ అంకెలే సంకేతాలు. పేరుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నవి 2,620 దుకాణాలే. కానీ 40-50 వేల బెల్ట్షాపుల్లో అనధికారికంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అంచనా. ఫలితంగా లక్షలాది కుటుంబాలు ఈ ఊబిలో చిక్కుకుని ఆర్థికంగా చితికిపోతున్నాయి. నూనూగు మీసాల ప్రాయంలోనే యువత మద్యానికి అలవాటుపడుతుండటం మరో ప్రమాదకర పరిణామమని, యుక్త వయసు వచ్చే నాటికి బానిసలుగా మారుతుండటంతో వారు ఎందుకూ కొరగాకుండా పోతున్నారని మేధావులు విశ్లేషిస్తున్నారు.
‘‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిసి సగటున 36.2 శాతం మంది పురుషులు ప్రతిరోజూ తాగుతున్నారు. గ్రామీణ, నగరాల్లో సగటున 54 శాతం మంది వారంలో ఒకసారి మత్తులో మునిగిపోతున్నారు. ముఖ్యంగా 15-49 ఏళ్ల వయసులో ప్రతిరోజూ తాగే వారిలో పురుషులతోపాటు మహిళలూ పెద్ద సంఖ్యలో ఉన్నారు’’ అని కొద్దిరోజుల క్రితం వెలువడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదికలో బహిర్గతమైంది.
‘మహిళలు ఎదుర్కొంటున్న గృహహింసకూ ప్రధాన కారణం మద్యపానమేనని, తమకొచ్చే గృహహింస కేసులలో కనీసం సగం అలాంటివేనని’ మహిళా భద్రతా విభాగానికి చెందిన అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు బిహార్లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత గత నాలుగేళ్ల వ్యవధిలో గృహహింస కేసులు 37 శాతం తగ్గినట్టు ఎన్సీఆర్బీ గణాంకాలే చెబుతున్నాయి. పలు సందర్భాల్లో ఇవి ప్రాణాలు తీసే వరకూ వెళ్తున్నాయని’’ అని ఓ పోలీసు అధికారి ‘ఈనాడు’తో చెప్పారు.
వ్యసనపరులు 6.33 లక్షల మంది
దేశవ్యాప్తంగా మత్తుపదార్థాల వినియోగంపై సామాజిక మంత్రిత్వశాఖ 2019లో నిర్వహించిన అధ్యయనంలో రాష్ట్రవ్యాప్తంగా 59,13,600 మంది మద్యం వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. వీరిలో 6,33,600 మంది బానిసలుగా మారినట్లు తేలింది. రెండేళ్ల క్రితం లెక్కలతో పోలిస్తే ఇప్పుడు ఈ సంఖ్య మరెంతో అధికంగా ఉంటుందనేది అంచనా. ‘‘ఇలాంటి వారు తమ సంపాదనలో ఎక్కువ భాగం మద్యానికే ఖర్చుచేస్తున్నారు. తాగేందుకు అవసరమైన డబ్బులు లేని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో ఘర్షణలకు దిగుతున్నారు. ఇవి అంతిమంగా గృహహింసకు, వరకట్న వేధింపుల తాలూకు హత్యలకు కూడా కారణమవుతున్నాయి.
యుక్త వయసులోనే వితంతువులుగా
వరంగల్ గ్రామీణ జిల్లా దామెర మండలం తక్కళ్లపాడు జనాభా సుమారు 1500. అధికారికంగా అక్కడ మద్యం దుకాణం లేదు. ఐదు బెల్ట్షాపుల్లో పగలూరాత్రి తేడా లేకుండా దొరుకుతుండటంతో ఎక్కువ మంది పురుషులు బానిసలయ్యారు. 30-40 ఏళ్ల ప్రాయంలోనే అనారోగ్యాలతో పాణాలు కోల్పోయారు. ఈ కారణంగా దాదాపు 15-20 మంది మహిళలు యుక్త వయసులోనే వితంతువులుగా మారారు. ‘‘పరిస్థితి చేయి దాటుతుండటంతో ఊరంతా ఏకమై 2019 అక్టోబరు 2న గాంధీజయంతి సందర్భంగా గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించామని’’ సర్పంచ్ రాజేందర్ తెలిపారు. ఒక్క గ్రామంలోనే ఇంతమంది పసుపుకుంకుమలు కోల్పోయారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. మద్యం సామాజికంగా ఎంత నష్టం చేస్తుందో చెప్పే ఉదాహరణ ఇది.
యువశక్తి నిస్సారం
మద్యం తాగే అలవాటు పదేళ్ల ప్రాయం నుంచే మొదలవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీరిలో చాలా మంది సంపాదించే స్థాయికి చేరుకునే 20 ఏళ్ల ప్రాయంలోనే వ్యసనపరులవుతున్నట్టు తేల్చాయి. ‘మొదట స్నేహితుల బలవంతంతోనే, సరదాగానో మొదలుపెడుతున్నారు. తర్వాత అది వ్యసనంగా మారుతోంది. ఒక దశలో తగినంత సొమ్ముల్లేక ఇతర మత్తుపదార్థాలకు అలవాటుపడుతున్నవారూ లేకపోలేదు. ఫలితంగా యువశక్తి నిరుపయోగం అవుతోంది. నిరంతరం తాగుతూ అనారోగ్యాల బారినపడుతున్న కారణంగా వైద్యానికి అయ్యే ఖర్చు ఆయా కుటుంబాలకు అదనపు భారంగా మారుతోంది. ఎంతోమంది కాలేయ సమస్యల బారినపడుతున్నారు’’ అని మద్య ప్రభావంపై చైతన్యపరుస్తున్న ఓ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి
శంషాబాద్ విమానాశ్రయ రన్వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. -
వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
కోర్టులో నేరుగా హాజరుపరచాలని కవిత దరఖాస్తు
ప్రస్తుతం దిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు ముందు విచారణ జరిగే సమయంలో తనను నేరుగా హాజరుపరచాలంటూ భారాస ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు దాఖలుచేశారు. -
సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు
సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. -
నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు
తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. పదోన్నతులకు టెట్ మినహాయింపునిస్తాం
తెలంగాణలో 2010 కన్నా ముందు నియమితులై 1 నుంచి 5 తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులిస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఛైర్మన్ యోగేశ్ సింగ్ తెలిపారు. -
టెట్ పరీక్షల షెడ్యూలు విడుదల
ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024 షెడ్యూలును విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. -
6న ఈసెట్
టీఎస్ ఈసెట్-2024 ప్రవేశ పరీక్ష మే 6వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. -
ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు
ఎండల తీవ్రత దృష్ట్యా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అనితా రామచంద్రన్ ఆదేశించారు. -
ఆర్టీసీ రిజర్వేషన్ ఛార్జీలపై మినహాయింపు
దూరప్రాంత బస్ సర్వీసుల్లో రిజర్వేషన్ ఛార్జీలపై టీఎస్ఆర్టీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. -
40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర గెజిటెడ్ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. -
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. -
హెచ్సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడి.. పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ