China: అంతిమయాత్ర ఏర్పాట్లలో ట్రక్కు బీభత్సం.. 19 మంది మృతి..!
చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో 19మంది దుర్మరణం చెందగా.. 20మంది గాయపడ్డారు.
ఇంటర్నెట్డెస్క్: అంతిమయాత్ర ఏర్పాట్లు చేస్తున్న ప్రదేశంపైకి ఓ ట్రక్కు దూసుకు రావడంతో 19 మంది మృతి చెందిన ఘటన చైనా(China)లోని జియాంగ్సీ ప్రావిన్స్లోని నాన్చంగ్ శివార్లలో చోటు చేసుకొంది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. నాన్చంగ్ శివార్లలో టాయిలింగ్ గ్రామం వద్ద ఓ వ్యక్తి అంతిమ యాత్ర కోసం రోడ్డు పక్కన టెంట్ వేశారు. అక్కడ అంతిమయాత్రలో పాల్గొనేందుకు ప్రజలు గుమిగూడి ఉన్న సమయంలో ఓ ప్రయాణికుల ట్రక్కు వారికపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో కనీసం 19 మంది దుర్మరణం చెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా పొగమంచు కారణమా అనేది తెలియరాలేదు. ప్రమాదం జరిగిన చోట మాత్రం పొగమంచు దారుణంగా ఉండటంతో ఎదుటి వాహనాలు సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొందని సీసీటీవీ పేర్కొంది. ఈ ప్రమాదం జరిగిన గంట తర్వాత నాన్చంగ్ కౌంటీలో ట్రాఫిక్ పోలీసులు డ్రైవింగ్ అడ్వైజరీని జారీ చేశారు.
చైనా(China)లో భారీ రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. చైనాలో లూనార్ కొత్త సంవత్సర వేడుకలు మొదలు కావడం, కొవిడ్ నిబంధనలు సడలించడంతో చాలా మంది ప్రయాణాలు మొదలుపెట్టారు. గత నెల జెంగ్ఝూలోని ఓ జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా వందలాది వాహనాలు ఢీకొని గుట్టగా పడిన ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. అంతకుముందు నెలలో 56 కార్లు పరస్పరం ఢీకొని 17 మంది మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు