Biden: పగ, ప్రతీకారాన్ని తిరస్కరించండి.. ట్రంప్పై విరుచుకుపడ్డ బైడెన్
Biden: కాంగ్రెస్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధ్యక్ష రేసులో నిలవనున్న ఆయన ఈ వేదికను ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని బలపర్చుకునేందుకు ఉపయోగించుకున్నారు. ట్రంప్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ దేశానికి చాలా ప్రమాదకరమని అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) అన్నారు. పగ, ప్రతీకారంతో బరిలోకి దిగుతున్న ఆయన్ను రాబోయే ఎన్నికల్లో తిరస్కరించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి ఏటా చేసే ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగంలో గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ వార్షిక సమావేశంలో అధ్యక్షుడు తమ ప్రభుత్వ విధానాలు, ప్రాథమ్యాలు, భవిష్యత్తు కార్యాచరణను ప్రజల ముందు ఉంచుతారు. కానీ, రెండోసారి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న బైడెన్ తాజాగా ఈ వేదికను తన అభ్యర్థిత్వాన్ని బలపర్చుకోవడం కోసం ఉపయోగించుకున్నారు.
‘‘జీవితం నాకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని స్వీకరించడం నేర్పింది. నిజాయతీ, మర్యాద, గౌరవం, సమానత్వం.. అమెరికాను నిర్వచించిన ఈ విలువలపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందరినీ గౌరవించాలి. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. ద్వేషానికి ఎక్కడా తావివ్వొద్దు. కానీ, ఇప్పుడు కొంత మంది పగ, ప్రతీకారంతో కూడిన అమెరికాను చూస్తున్నారు’’ అంటూ పరోక్షంగా ట్రంప్ (Donald Trump)పై బైడెన్ విరుచుకుపడ్డారు. తయారీ, మౌలిక వసతుల రంగంలో తన హయాంలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఉక్రెయిన్కు మరింత సాయం అందించేందుకు సహకరించాలని కాంగ్రెస్ను కోరారు. ఔషధ ధరలను తగ్గించటం, కఠిన వలస విధానాల రూపకల్పనపై కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా విజృంభిస్తుండడం, ఆర్థిక వృద్ధి క్షీణిస్తున్న సమయంలో 2021లో తాను అధికారంలోకి వచ్చానని బైడెన్ గుర్తు చేశారు. తన హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా భవిష్యత్తు మెరుగ్గా ఉండనుందని తెలిపారు. కానీ, ట్రంప్ అధికారంలోకి వస్తే మాత్రం అది పూర్తిగా దెబ్బతింటుందన్నారు. మరోవైపు కార్పొరేట్ పన్ను పెంపుపైనా బైడెన్ తన ప్రణాళికలను వివరించారు. అబార్షన్ హక్కులకు మద్దతు పలకడం గమనార్హం.
గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి మద్దతునివ్వటంపై సొంత పార్టీ నుంచే బైడెన్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజా ప్రసంగంలో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి కృషి చేస్తున్నామని ప్రకటించారు. గాజాకు మానవతా సాయం అందించడం కోసం ప్రత్యేకంగా ఓ నౌకాశ్రయాన్నే ఏర్పాటు చేశామని చెప్పారు. మరింత సాయాన్ని అందించేందుకుగానూ కాంగ్రెస్ మద్దతు కోసం చేస్తున్న ప్రయత్నాలకు రిపబ్లికన్లు అడ్డు నిలుస్తున్నారని ఆరోపించారు.
బైడెన్ వయసుపైనా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వయోభారం నేపథ్యంలో మరోసారి అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడంటూ విమర్శలు వస్తున్నాయి. తాజా స్పీచ్లో వాటికీ బైడెన్ సమాధానం ఇచ్చారు. వయసు ముఖ్యం కాదని.. విధానాలపైనే దృష్టి సారించాలని వ్యాఖ్యానించారు. మరోవైపు గాజాలో కాల్పుల విరమణను కోరుతూ అనేక మంది రోడ్లపై నిరసనలు చేపట్టారు. దీంతో బైడెన్ కాన్వాయ్ మరో మార్గంలో క్యాపిటల్ హిల్కు చేరుకోవాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్