Israel: అమెరికా అనూహ్య నిర్ణయం.. ఇజ్రాయెల్ సెటిలర్లపై ఆంక్షలు!
Israel: వెస్ట్బ్యాంక్లో పాలస్తీనావాసులపై హింసకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ సెటిలర్లపై ఆంక్షలు విధిస్తూ అమెరికా ఉత్తర్వులు జారీ చేసింది.
వాషింగ్టన్: వెస్ట్ బ్యాంక్లోని ఇజ్రాయెల్ సెటిలర్లపై (Israeli settlers) అమెరికా ఆంక్షలు విధించింది. పాలస్తీనావాసులపై పెరుగుతున్న హింస నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గురువారం అధ్యక్షుడు బైడెన్ (Joe Biden) ఉత్తర్వులు జారీ చేశారు. మిత్రదేశమైన ఇజ్రాయెల్కు చెందిన పౌరులపై అగ్రరాజ్యం ఇలా అనూహ్య చర్యలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తొలిదశలో భాగంగా వెస్ట్బ్యాంక్లోని నలుగురు ఇజ్రాయెల్ సెటిలర్లపై (Israeli settlers) అమెరికా ఆర్థిక ఆంక్షలతో పాటు వీసా నిషేధం విధించింది. వీరు పాలస్తీనావాసులపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని, ఆస్తులను ధ్వంసం చేయటంతో పాటు వాటిని లాక్కుంటామని బెదిరించారని ఆరోపించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel Hamas conflict) ప్రారంభమైన తర్వాత సామాన్య పౌరులపై జరిగిన దాడుల్లో పాల్గొన్న ఇతరులపై కూడా చర్యలు తీసుకోవాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది.
తమ పౌరుల్లో కొంత మందిని ఇజ్రాయెల్ సెటిలర్లు (Israeli settlers) చంపేశారని.. కార్లకు నిప్పంటించారని పాలస్తీనా అధికారులు ఇటీవల ఆరోపించారు. దాడులు చేస్తూ వెంటనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బైడెన్ ఆంక్షలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. హమాస్ను అంతమొందించే లక్ష్యంలో కొంత సంయమనం పాటించాలని ఇజ్రాయెల్కు ఇటీవల సూచించారు.
హమాస్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్ బ్యాంక్లోనూ దాడులు ప్రారంభించింది. ఈ ప్రాంతంలోని మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని పోరాడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకొని అక్కడి సెటిలర్లు పాలస్తీనా పౌరులపై దాడులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారిని ఇజ్రాయెల్ సైన్యం నిలువరించటం లేదని.. పైగా రక్షణ కల్పిస్తోందని పాలస్తీనా అధికారులు చెబుతున్నారు. వెస్ట్బ్యాంక్లోని చాలా మంది సెటిలర్లకు అమెరికా పౌరసత్వం ఉంది. కొంత మంది ద్వంద్వ పౌరసత్వమూ కలిగి ఉన్నారు. వారెవరూ హింసాత్మక చర్యల్లో పాల్గొనటంలేదని యూఎస్ అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.