Joe Biden: సైనిక చర్యలో రష్యా పక్షాన చైనా..? ఆధారాల్లేవన్న బైడెన్!
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పక్షాన చైనా నిలుస్తుందనడానికి ఆధారాలు లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. మరోవైపు.. ఉక్రెయిన్పై పుతిన్ అణ్వాస్త్రాలు వినియోగించకుండా నిరోధించడంలో భారత్, చైనాల ప్రభావం కూడా పని చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ వెల్లడించారు.
వాషింగ్టన్: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) దండయాత్ర కొనసాగుతోన్న వేళ.. మాస్కోకు చైనా(China) నుంచి కీలక మద్దతు వెళ్లే అవకాశం ఉందని అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే. రష్యా కొత్తగా దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండటంతో చైనా నుంచి ప్రమాదకర ఆయుధాలను అక్కడికి తరలించవచ్చని భావిస్తున్నట్లు అగ్రరాజ్య విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్(Antony Bliken) ఇటీవల వెల్లడించారు. అయితే, ఈ సైనిక చర్య విషయంలో చైనా.. రష్యా పక్షాన నిలుస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తాజాగా తెలిపారు.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పక్షాన చైనా నిలుస్తుందని ఆందోళన చెందుతున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బైడెన్ ఈ మేరకు స్పందించారు. ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. ఈ విషయమై చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఇప్పటికే మాట్లాడినట్లు వెల్లడించారు. మరోవైపు.. రష్యాకు చైనా ఆయుధ సాయం అందించడాన్ని చూడలేదని పెంటగాన్ సైతం పేర్కొంది. అధునాతన ఆయుధ సామర్థ్యాలు కలిగి ఉన్న చైనా.. ఉక్రెయిన్ విషయంలో తన తటస్థతను బహిరంగంగానే ప్రకటించిందని పెంటగాన్ ప్రెస్ సెక్రెటరీ ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్ గుర్తుచేశారు.
‘భారత్, చైనాల ప్రభావం కూడా కారణమే..’
ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వస్త్రాలు ప్రయోగించే అవకాశం లేకపోలేదన్న వార్తలు గతంలో చక్కర్లు కొట్టాయి. అయితే, ఈ విషయంలో రష్యా వెనకడుగుకు భారత్, చైనాల బలమైన ప్రభావం కూడా కారణమై ఉండొచ్చని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు. లేనిపక్షంలో, యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ ఇప్పటికే అణ్వాయుధాలను ప్రయోగించి ఉండొచ్చన్నారు. ‘యుద్ధభూమిలో అణ్వాయుధాల వినియోగాన్ని వ్యతిరేకించడంలో భారత్, చైనాలు.. రష్యాపై కొంచెం ఎక్కువ ప్రభావం చూపాయి’ అని బ్లింకెన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రక్షణ రంగంలో భారత్, రష్యాల మధ్య దశాబ్దాల బంధం ఉందని పేర్కొంటూనే, కొన్నేళ్లుగా భారత్.. అమెరికా, ఫ్రాన్స్లవైపు సైతం మొగ్గుచూపుతోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్