China: చైనాలో కొవిడ్ విలయం.. శ్మశానాల వద్ద మృతదేహాలతో బారులు..?
చైనాలో కొవిడ్ మరణాలు భారీ స్థాయిలో చోటుచేసుకుంటున్నాయనే వార్తలు కలవరపెడుతున్నాయి. అధికారికంగా గత మూడు వారాల్లో కేవలం పదిలోపే మరణించినట్లు చైనా అధికారులు పేర్కొన్నారు. కానీ, శ్మశానాల వద్ద మృతదేహాలతో బారులు తీరిన పరిస్థితిని చూస్తే వాస్తవ పరిస్థితులు అర్థమవుతున్నాయని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు పేర్కొన్నారు.
బీజింగ్: చైనాలో(China) కరోనా మారణహోమం సృష్టిస్తోంది. నిత్యం వేల మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని వార్తలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నా గత వారం రోజుల్లో కేవలం ఒకే ఒక్క మరణం చోటుచేసుందని చైనా ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో శ్మశానాల (crematoriums) వద్ద భయానక పరిస్థితులు ఉన్నాయని.. మృతదేహాలతో కుటుంబీకులు బారులు తీరిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చైనాలో కొవిడ్ మరణాల పరిస్థితిని తెలియజేస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగల్ డింగ్ షేర్ చేసిన వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
చైనాలో కరోనా వైరస్ తీవ్రతపై ఆయన వరుస ట్వీట్లలో వివరించారు. ‘మృతదేహాలతో శ్మశానాల వద్ద బారులు తీరిన కుటుంబీకులు.. గంటలపాటు వేచిచూస్తున్న దారుణ పరిస్థితి. మరోవైపు ఆస్పత్రి మార్చురీలు నిండిపోయి.. కారిడార్లలోనే వరుసగా పెట్టిన మృతదేహాలు కనిపిస్తున్నాయ్’ అని పేర్కొంటూ అందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి అక్కడ 20లక్షల కొవిడ్ మరణాలు సంభవించవచ్చనే అంచనాలకు తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ప్రతి నగరంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య లక్షల్లో ఉంటోందని చెబుతున్నాయి.
కొవిడ్కు సంబంధించిన సమాచారం ఇలా బయటకు వస్తుంటే.. చైనా అధికారిక లెక్కలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జీరో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన డిసెంబర్ 7 తర్వాత కేవలం ఏడుగురు మాత్రమే కొవిడ్తో మరణించారని అధికారికంగా వెల్లడించింది. ఇలా గత మూడేళ్ల నుంచి ఇప్పటివరకు మొత్తంగా 5241 మంది మాత్రమే చనిపోయినట్లు పేర్కొనడం గమనార్హం. ఇలా మరణాల సంఖ్యను గణించకపోవడం, తక్కువ చేసి చూపడం పట్ల ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కచ్చితమైన సమాచారం ఇవ్వాలంటూ చైనాకు సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
Taiwan: తైవాన్లో పార్లమెంట్ సభ్యులు విచక్షణ మరిచి పరస్పరం దాడికి దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. -
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కిర్గిస్థాన్ (Kyrgyzstan) రాజధానిలో మూక హింస చెలరేగడంతో.. భారత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. -
మరింత సంపన్నులైన రిషి, అక్షతా దంపతులు
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు. -
అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ పోటీ!
పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా (47) మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సహచరులు భావిస్తున్నారు. -
2050 నాటికి పెరగనున్న ఆయుర్దాయం
ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది. -
ఉత్తర గాజాలో హోరాహోరీ
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి. -
ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది : డబ్ల్యూహెచ్వో
అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు, పక్షవాతం, క్యాన్సర్ల లాంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ సైమా వాజెడ్ చెప్పారు. -
ఖర్కీవ్ను ఆక్రమించే ప్రణాళికల్లేవ్
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. -
నరమేధానికి పాల్పడలేదు
గాజాలో తాము నరమేధానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. పౌరుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) తెలిపింది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి
యువకుడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. ఎట్టకేలకు ఓ సోషల్ మీడియా పోస్టు ఆధారంగా బాధితుడిని రక్షించారు. -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా ధ్రువీకరించింది. -
పర్యావరణ హితులకు యూఏఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా’లు
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
Elon Musk: మరో 30 ఏళ్లలో అంగారక గ్రహంపై ఏర్పాటయ్యే నగరంలో మనుషులు జీవిస్తారని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప