మూడేళ్ల తర్వాత తెరుచుకోనున్న చైనా సరిహద్దులు.. అన్ని రకాల వీసాలకు గ్రీన్సిగ్నల్
China to Allow tourists: మూడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం చైనా తన సరిహద్దులను తెరవనుంది. పర్యాటకులను మునుపటిలా ఆహ్వానం పలకనుంది. అన్ని వీసాలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.
బీజింగ్: కొవిడ్ నుంచి ఈ మధ్యనే కోలుకున్న చైనా (China).. సుదీర్ఘ విరామం అనంతరం తొలిసారి తన సరిహద్దులను తెరవనుంది. పర్యాటకులను (tourists) మునుపటిలా దేశంలోకి అనుమతించనుంది. బుధవారం నుంచి అన్ని రకాల వీసాలను (Visa) పునరుద్ధరించనుంది. కొవిడ్ కారణంగా దాదాపు మూడేళ్ల పాటు చైనా తన సరిహద్దులను మూసేసింది. దీంతో వృద్ధి నెమ్మదించింది. పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం సైతం పడిపోయింది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగాన్ని గాడిన పెట్టేందుకు మూడేళ్ల తర్వాత సరిహద్దులు తెరిచేందుకు చైనా నిర్ణయించింది.
కొవిడ్పై విజయం సాధించామని ఇటీవల చైనా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు బుధవారం నుంచి అనుమతిస్తామని చైనా మంగళవారం ప్రకటించింది. వీసాలు అవసరం ఉన్న వారితో పాటు హాంకాంగ్, మకావు, హైనన్ ఐల్యాండ్ నుంచి వీసా అవసరం లేని టూరిస్టులను సైతం బుధవారం నుంచి దేశంలోకి అనుమతించనున్నట్లు తెలిపింది. 2020 మార్చి 28కు ముందు విదేశీయులకు జారీ చేసిన వీసాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. అయితే, కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, కొవిడ్ పాజిటివ్/నెగటివ్ సర్టిఫికెట్ వంటివి అవసరమా లేదా? అనేది మాత్రం చైనా పేర్కొనలేదు.
కొవిడ్ కట్టడికి దేశమంతటా కఠిన జీరో-కొవిడ్ పాలసీని చైనా అనుసరించింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. పైగా ప్రజల నుంచీ తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ పాలసీకి చరమగీతం పాడింది. అదే సమయంలో కొవిడ్ కేసులు భారీ స్థాయిలో రావడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఇటీవలే కొవిడ్పై విజయం సాధించినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు ఆహ్వానించి ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు సరిహద్దులను తెరవాలని చైనా నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
ఈక్వెడార్ సోషల్ మీడియా స్టార్, మోడల్ లాండీ పరాగా హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టా వేదికగా చేసిన పోస్టు సహాయంతో ఆమెను నిందితులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
Canada: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. -
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు