Gaza: ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 20వేలు దాటిన మృతుల సంఖ్య
హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలో అక్కడి సామాన్య ప్రజలు బలవుతున్నారు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు గాజాలో మొత్తం 20వేల మంది మృతి చెందినట్లు తాజాగా గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది.
జెరూసలెం: గాజా (Gaza)పై ఇజ్రాయెల్ (Israel) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్) జరిపిన దాడుల్లో శనివారం ఒక్కరోజే 200 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గాజా అధికారులు తెలిపారు. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు గాజాలో 20,258 మంది మృతి చెందారని హమాస్ ఆధీనంలోని ఆరోగ్యశాఖ వెల్లడించింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని తెలిపింది.
గాజాలో ఇజ్రాయెల్ సృష్టించిన విధ్వంసం కారణంగా అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. 24 లక్షల జనాభాలో 19 లక్షల మంది శరణార్థి శిబిరాలు, టెంట్లలో తలదాచుకోవాల్సి వస్తోందని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది. నీరు, ఆహారం, వైద్య సేవలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. వారికి సాయం చేయాలంటే మానవత్వంతో కాల్పులు విరమించడం ఒక్కటే మార్గమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చెప్పారు. ఇజ్రాయెల్ తన చర్యలతో మానవతా సాయానికి అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు.
హమాస్ దాడిలో ఐదుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతి
హమాస్ మిలిటెంట్ల అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా హమాస్తో జరిగిన పరస్పర దాడుల్లో తమ బలగాలకు చెందిన ఐదుగురు సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. శుక్రవారం దక్షిణ గాజాలో నలుగురు, శనివారం ఉత్తర గాజాలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
గాజాలో భీకర దాడి.. ఒకే కుటుంబానికి చెందిన 76 మంది మృతి..!
నెతన్యాహుకి బైడెన్ ఫోన్
గాజాలో శనివారం జరిగిన భీకర దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై వారిద్దరు చర్చించినట్లు శ్వేతసౌధం ప్రతినిధులు తెలిపారు. ఇజ్రాయెల్కు అమెరికా ఎప్పుడూ మద్దతుగానే ఉంటుందని, అయితే.. గాజాలో మృతుల సంఖ్య పెరగడం, మానవతా సాయం సంక్షోభంలో పడటం పట్ల ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
పాకిస్థాన్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియమితులయ్యారు. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు. -
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?