Trump: ‘ఎక్కడైనా.. ఎప్పుడైనా’.. బైడెన్కు ట్రంప్ సవాల్
Trump: అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ నుంచి బైడెన్ పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో తనతో చర్చకు రావాలని బైడెన్కు ట్రంప్ సవాల్ విసిరారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠం కోసం మరోసారి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), జో బైడెన్ పోటీ పడడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో తనతో చర్చకు రావాలని బైడెన్కు (Joe Biden) ట్రంప్ సవాల్ విసిరారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి అంశంపై తమ అభిప్రాయాలను ప్రజల ముందుంచడం అవసరమని వ్యాఖ్యానించారు.
‘‘అమెరికా ప్రయోజనాలు, దేశ ప్రజల శ్రేయస్సు కోసం అవసరమైన అన్ని కీలక అంశాలపై నేను, జో బైడెన్ చర్చించడం చాలా అవసరం’’ అని ట్రంప్ తన ట్రుత్ సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. తాను ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని బైడెన్కు సవాల్ విసిరారు. అయితే, ప్రైమరీ ఎన్నికల సమయంలో పార్టీలో తనతో పోటీ పడిన వారితో జరిగిన చర్చల్లో మాత్రం ట్రంప్ పాల్గొనలేదు. మంగళవారం 15 రాష్ట్రాలు, ఒక టెర్రిటరీలో ‘సూపర్ ట్యూస్డే’ పేరిట జరిగిన ప్రైమరీ/కాకసస్లలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్ ఘనవిజయం సాధించారు. ఒక్క వెర్మాంట్లో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో గెలుపొందారు.
వెర్మాంట్ను భారత సంతతి అమెరికన్ నిక్కీ హేలీ (Nikki Haley) కైవసం చేసుకున్నారు. మిగతా ప్రైమరీల్లోనూ ఆమె మాజీ అధ్యక్షుడికి గట్టి పోటీ ఇవ్వడం గమనార్హం. అయితే తాజా ఓటములతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష నామినేషన్ రేసు నుంచి వైదొలగుతున్నట్లు హేలీ ప్రకటించారు. తన ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీంతో రిపబ్లికన్ అధ్యక్ష రేసులో ట్రంప్ ఒక్కరే మిగిలారు. మరోవైపు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష నామినేషన్ రేసులో ఉన్న 81 ఏళ్ల బైడెన్.. సమోవా టెర్రిటరీలో తప్ప 15 రాష్ట్రాల్లోనూ విజయం సాధించారు. సమోవాలో జేసన్ పామర్ చేతిలో ఓడారు. ఇప్పటి వరకైతే అధికారికంగా వీరివురి మధ్యే పోటీ అని తేలకపోయినప్పటికీ.. అది లాంఛనమేనని స్పష్టమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!
-
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
-
అంతా సొంత డబ్బా.. హామీలపై మాట్లాడరేమబ్బా!