Earthquake: మూడు రోజుల్లో రెండుసార్లు.. మృత్యుంజయులుగా నిలిచిన తల్లీబిడ్డ!
సిరియాలోని భూకంప ప్రభావిత ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రాణాలతో బయటపడ్డారు తల్లీబిడ్డ. భూకంపం ధాటికి ఒకసారి పాక్షికంగా, మరోసారి పూర్తిగా ఇల్లు కూలిపోయిన ఘటనలనుంచి వారిని కాపాడారు.
డమాస్కస్: తుర్కియే(Turkey), సిరియా(Syria)లను భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా శిథిలాల కుప్పలు, మృతదేహాలతో స్థానికంగా పరిస్థితులు దారుణంగా మారాయి. ఇంతటి నష్టాన్ని మిగిల్చిన ఘోర విపత్తులోనూ ఓ తల్లి, ఆమె శిశువు మాత్రం మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రాణాలతో బయటపడటం విశేషం. సిరియాలోని జిందిరెస్ ప్రాంతానికి చెందిన దిమా ఏడు నెలల గర్భిణి. ఫిబ్రవరి 6న భూకంపం(Earthquake) సంభవించిన సమయంలో ఆమె ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలో భూ ప్రకంపనల ధాటికి ఇల్లు పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే సిరియన్ అమెరికన్ మెడికల్ సొసైటీ(SAMS) సహకారంతో ఆమెను అఫ్రిన్లోని ఆసుపత్రికి తరలించగా.. మగశిశువుకు జన్మనిచ్చింది.
అయితే, ప్రత్యామ్నాయ ఆశ్రయం అందుబాటులో లేకపోవడంతో ఆమె తన శిశువుతో మళ్లీ అదే ఇంటికి తిరిగిరావాల్సి వచ్చింది. భూకంపం ధాటికి అప్పటికే బలహీనంగా మారిన ఆ ఇల్లు.. మూడు రోజులకు పూర్తిగా కూలిపోయింది. దీంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన తల్లీబిడ్డను మరోసారి రక్షించారు. డీహైడ్రేషన్, కామెర్లతో అప్పటికే ఆ శిశువు పరిస్థితి విషమంగా మారడంతో.. అదే ఆస్పత్రికి మళ్లీ తరలించారు. దిమాకు సైతం చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక టెంట్ కింద తలదాచుకుంది. వాయువ్య సిరియాలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఈ పట్టణం.. ఇటీవలి భూకంపంతో తీవ్రంగా నష్టపోయింది. విపత్తుకు ముందు నుంచే మానవతా సాయంపై ఆధారపడుతోన్న స్థానికుల పరిస్థితి ప్రస్తుతం మరింత దయనీయంగా మారింది.
భూకంపం కారణంగా జిందిరెస్ ప్రాంతంలోని 55 ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నాయని ఐరాస తెలిపింది. మరో 31 పాక్షికంగా పని చేయడం, లేదా నిలిచిపోయినట్లు వెల్లడించింది. శిథిలాల నుంచి బయటపడుతోన్న బాధితులకు చికిత్స చేసేందుకు అవసరమైన మందులు, ఇతర వైద్య సామగ్రి, పడకలు, దుప్పట్ల కొరత తీవ్రంగా ఉందని స్థానిక వైద్యులు ఓ వార్తాసంస్థకు తెలిపారు. దీంతోపాటు ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత వంటి సమస్యలు వేధిస్తున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్