London: ‘చావులపై ఆసక్తి’.. ఇప్పటికే 200పైగా అంత్యక్రియలకు హాజరైన మహిళ
మరణాలు, అత్యక్రియలంటే తనకు ఎంతో ఇష్టమని బ్రిటన్కి చెందిన ఓ మహిళ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను ఇప్పటికే 200లకు పైగా అంత్యక్రియలకు హాజరైనట్లు తెలిపింది.
లండన్: ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లాలని.. రుచికరమైన భోజనం చేయాలని.. రంగుల ప్రపంచంలో గడపాలని..ఇలా మనుషులకు కొన్ని కోరికలు ఉండటం సహజమే. కానీ బ్రిటన్కు చెందిన ఓ మహిళకు మాత్రం విచిత్రమైన ఆసక్తి ఉంది. చావులు, అంత్యక్రియలంటే ఆమెకు ఎంతో ఇష్టమట. ఎక్కడ అంత్యక్రియలు జరిగినా.. వెళ్లేందుకు ప్రయత్నిస్తామని పేర్కొంటున్నారు. విచిత్ర ఆసక్తి ఉన్న ఆమె ఇప్పటికే 200లకు పైగా అంత్యక్రియలకు హాజరైనట్లు చెప్పారు. సమాధులు ఆర్ట్ గ్యాలరీల్లాంటివని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.
లండన్లోని ఇస్లింగ్టన్ ప్రాంతానికి చెందిన జీన్ ట్రెండ్హిల్ (55) తనకు చిన్నతనం నుంచే చావులు, అంత్యక్రియలపై ఆసక్తి ఏర్పడిందని చెబుతోంది. గతంలో బంధువులు, మిత్రుల అంత్యక్రియలకు హాజరైన ట్రెండ్హిల్.. కొన్నేళ్లుగా అపరిచితుల అంత్యక్రియలకూ హాజరవుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. తరచూ శ్మశానవాటికలకు వెళ్తానని ఆమె చెప్పినట్లు తెలిపింది. అయితే, అనాథలు, స్నేహితులు లేని వ్యక్తుల శవాలేమైనా వస్తే.. దహన సంస్కారాలకు రావాలని తనను స్థానిక శ్మశానవాటిక సిబ్బంది పిలుస్తారని ఆమె తెలిపారు.
‘బంధువులెవరూ హాజరుకాని అపరిచితుల అంత్యక్రియలకు వెళ్లడం నాకెంతో గర్వంగా అనిపిస్తుంది’ అని ట్రెండ్హిల్ పేర్కొనడం గమనార్హం. ‘నాకు చిన్నప్పటి నుంచి మరణం అంటే చాలా ఇష్టం. శ్మశానవాటికలకు వెళ్లి అక్కడి సమాధులను చూస్తూ తిరుగుతుంటాను. అవి ఆరుబయట ఆర్ట్ గ్యాలరీల్లాంటివి’ అని ఆమె చెప్పుకొచ్చింది. సమాధులు మధ్య గడుపుతూ దిగిన ఫొటోలను సైతం ఆమె ఫేస్బుక్లో పోస్ట్చేస్తూ ఉంటారు. ట్రెండ్హిల్ 14ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి చనిపోగా.. 20 ఏళ్ల ప్రాయంలో తండ్రి మృతిచెందాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..