France: అదనపు వైన్ నాశనం చేయించడానికి రూ. 1,700 కోట్ల ఖర్చు..!
ప్రపంచంలో చాలా దేశాల్లో మద్యం కోనుగోళ్లతో జనం జేబులకు చిల్లు పెట్టుకొంటుంటే.. ఫ్రాన్స్ మాత్రం మిగిలిన వైన్ను ధ్వంసం చేయడం కోసం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: మద్యం కొనుగోలుకు మందుబాబులు జేబులను గుల్ల చేసుకొంటుండగా.. ఫ్రాన్స్ (France) మాత్రం ఉన్న మద్యం స్టాక్ను వదిలించుకోవడానికి ఏకంగా 200 మిలియన్ యూరోలు (రూ.1,700 కోట్లు) ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా దేశంలో అదనంగా ఉన్న వైన్ను ధ్వంసం చేయాలని నిర్ణయించింది. వైన్కు మంచి ధర తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యలో ఇది కూడా ఓ భాగం.
ఇప్పటికే ఫ్రాన్స్లో ద్రవ్యోల్బణం, కొవిడ్ ప్రభావంతోపాటు.. క్రాఫ్టెడ్ బీర్కు దేశవ్యాప్తంగా పెరిగిన డిమాండ్తో వైన్ (Wine) తయారీదారులు అవస్థలు పడుతున్నారు. వైన్ దిగ్గజాలైన బోర్డాక్స్, లాంగ్యూడాక్ సంస్థలు గణనీయంగా వైన్ ఉత్పత్తి చేయడంతో నిల్వలు భారీగా పేరుకుపోయాయి. మరో వైపు డిమాండ్ పడిపోవడంతో ధర తగ్గిపోయింది. ‘‘మేము విపరీతంగా వైన్ ఉత్పత్తి చేశాం. విక్రయధరలు ఉత్పత్తి ధరల కంటే తక్కువగా ఉన్నాయి. మేము భారీగా నష్టపోతున్నాం’’ అని లాంగ్యూడాక్ వైన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్కు చెందిన జేన్ ఫిలిప్ప్ గ్రానియర్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, ఆహారం, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు వ్యయాలను గణనీయంగా తగ్గించుకొన్నారు. ముఖ్యంగా వైన్ వంటి అనవసర ఖర్చులను తగ్గించారు.
విధేయత ప్రకటిస్తారా.. జైల్లోకి వెళతారా!
తాజాగా కేటాయించిన 200 మిలియన్ యూరోలతో ఫ్రాన్స్ ప్రభుత్వమే ఈ స్టాక్ను కొనుగోలు చేస్తుంది. ఆ తర్వాత ధ్వంసం చేసి.. అందులోని ఆల్కాహాల్ను మాత్రం వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేయడానికి కంపెనీలకు విక్రయించనుంది. దీంతోపాటు వైన్ తయారీ దారులు ఇతర మార్గాల్లో ఉపాధి వెతుక్కోడానికి నిధులను కేటాయించింది.
‘‘వైన్ ధర పతనం కాకుండా కాపాడేందుకు, ఉత్పత్తిదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొనేందుకు ఈ నిధులను వెచ్చిస్తాం. భవిష్యత్తు చూడండి.. మారుతున్న కస్టమర్ల అభిరుచులను గమనించండి’’ అని దేశ వ్యవసాయ శాఖ మంత్రి మార్క్ ఫెస్నో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ వరకు ఐరోపా కమిషన్ గణాంకాల ప్రకారం ఇటలీలో 7, స్పెయిన్లో 10, ఫ్రాన్స్లో 15, జర్మనీలో 22, పోర్చుగల్లో 34 శాతం వైన్ వినియోగం పతనమైనట్లు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన కోహ్లీ, జాక్స్.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!