France: ఫ్రాన్స్లో విమానం నిలిపివేత.. న్యాయమూర్తి ముందుకు ప్రయాణికులు
మానవ అక్రమ రవాణా అనుమానంతో పారిస్ అధికారులు అదుపులోకి తీసుకున్న విమానంలోని ప్రయాణికులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.
పారిస్: మానవ అక్రమ రవాణా (Human Trafficking) జరుగుతోందనే అనుమానంతో పారిస్ (Paris) అధికారులు అదుపులోకి తీసుకున్న 303 మంది ప్రయాణికులు ఆదివారం స్థానిక న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు. ఈ మేరకు విమానాశ్రయంలోనే న్యాయవిచారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం వరకు ప్రయాణికులను న్యాయమూర్తి విచారించనున్నారు.
ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. విదేశీయులను ఫ్రెంచ్ సరిహద్దు పోలీసులు నాలుగు నుంచి ఎనిమిది రోజుల వరకు తమ ఆధీనంలో ఉంచుకోవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో గరిష్ఠంగా 26 రోజులకు మించి విదేశీయులను తమ అదుపులో ఉంచుకోకూడదు. ఈ నేపథ్యంలో వారిని గమ్యస్థానాలకు పంపాలా? తిరిగి వెనక్కి పంపేయాలనేది న్యాయమూర్తి నిర్ణయిస్తారని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. ‘‘గతంలో ఫ్రాన్స్లో ఇలా జరిగిందో లేదో నాకు తెలియదు. కానీ, ఇది త్వరగా పరిష్కరించాల్సిన సమస్య. ఎందుకంటే తగిన ధ్రువపత్రాలు లేకుండా విదేశీయులను ఎక్కువ రోజులు అదుపులో ఉంచేందుకు ఫ్రాన్స్ చట్టాలు అనుమతించవు. ఇక వారి భవితవ్యం న్యాయమూర్తి తీర్పుపై ఆధారపడి ఉంటుంది’’ ఫ్రాంకోయిస్ ప్రొక్యూర్ అనే న్యాయవాది తెలిపారు. మరోవైపు వీరిలో కొద్ది మంది ప్రయాణికులు శరణార్థులుగా ఆశ్రయం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
ప్రయాణికులతో సంప్రదిస్తున్నాం: భారత ఎంబసీ
రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ విమానం గురువారం దుబాయి నుంచి నికరాగువాకు వెళుతూ ఇంధనం కోసం పారిస్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాట్రీ విమానాశ్రయంలో ఆగింది. మానవ అక్రమ రవాణా జరుగుతోందని సమాచారం అందడంతో ఫ్రాన్స్ అధికారులు ఆ విమానాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. విమానంలోని 303 మంది ప్రయాణికుల్లో భారతీయులే అత్యధికం. వారిలో 13 మంది మైనర్లు అని స్థానిక పత్రిక వెల్లడించింది. అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించేందుకుగాను సెంట్రల్ అమెరికాకు చేరుకునే ప్రణాళికలో భాగంగా వీరంతా నికరాగువాకు వెళ్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో న్యాయ విచారణ తర్వాత ప్రయాణికుల భవితవ్యం తేలనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలోజగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం