హెచ్ 1బీ వీసాల తిరస్కరణలతో.. అమెరికా కంపెనీలకు సిబ్బంది కొరత
ఏటా 85,000 మంది విదేశీ నిపుణులకు మాత్రమే హెచ్ 1బీ వీసాలు మంజూరవుతున్నందున అమెరికన్ కంపెనీల సిబ్బంది అవసరాలు తీరడం లేదని ఒక అధ్యయనం తెలిపింది.
వాషింగ్టన్: ఏటా 85,000 మంది విదేశీ నిపుణులకు మాత్రమే హెచ్ 1బీ వీసాలు మంజూరవుతున్నందున అమెరికన్ కంపెనీల సిబ్బంది అవసరాలు తీరడం లేదని ఒక అధ్యయనం తెలిపింది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్.ఎఫ్.ఎ.పి.) సంస్థ నిర్వహించిన అధ్యయనమిది. గతేడాది ఏప్రిల్లో అమెరికా కంపెనీలు 4,83,000 హెచ్ 1బీ వీసా దరఖాస్తులు సమర్పించగా.. వాటిలో 85,000 దరఖాస్తులకు వీసాలు లభించాయి. విదేశీ నిపుణులు అమెరికాలో వైద్యం, టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాల్లో ఆరేళ్లపాటు పనిచేయడానికి హెచ్ 1బీ వీసా వీలు కల్పిస్తుంది. ఆరేళ్ల తరవాత శాశ్వత నివాసం కింద గ్రీన్కార్డులు పొందడానికి అవకాశాలు మెరుగుపడతాయి. అమెరికా విశ్వవిద్యాలయాల్లో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సులు అభ్యసిస్తున్నవారిలో 70 శాతం మందికి పైగా విదేశీ విద్యార్థులే. వారిలోనూ భారత్, చైనా విద్యార్థులే ఎక్కువ. ఏటా మంజూరయ్యే 85,000 హెచ్ 1బీ వీసాల్లో 20 వేల వీసాలను అమెరికాలో విద్యాభ్యాసం చేసిన విదేశీ విద్యార్థులకు కేటాయిస్తారు. అమెరికా కార్మిక బలగం 16.5 కోట్లు కాగా, వారిలో హెచ్ 1బీ వీసాదారుల సంఖ్య కేవలం 0.05 శాతం. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాకు విదేశీ నిపుణులు, సాధారణ కార్మికుల వలసలను వ్యతిరేకించినందున హెచ్ 1బీ వీసాËల్లో అత్యధికం తిరస్కరణకు గురయ్యేవి. దీనివల్ల నిపుణుల కొరత ఏర్పడి అమెరికన్ కంపెనీలు తమ పనులను, సిబ్బందిని విదేశాలకు తరలించడం ఎక్కువైంది.
* టెక్ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించడం హెచ్ 1బీ వీసాదారులను ఇబ్బంది పెడుతోంది. అయితే, వారిలో 79 శాతం మందికి మూడు నెలల్లోనే కొత్త ఉద్యోగం లభిస్తోంది. ప్రతి 10 మందిలో నలుగురు నెల రోజుల్లోనే కొత్త ఉద్యోగం సాధించగలుగుతున్నారని జిప్ రిక్రూటర్ సంస్థ సర్వేలో తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?