మరోసారి నవ్వులపాలైన పాకిస్థాన్!
అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ మరోసారి నవ్వులపాలైంది. భూకంపంతో అతలాకుతలమైన తుర్కియేకు సాయం అందించి విమర్శలు ఎదుర్కొంటోంది.
తుర్కియే ఇచ్చిన సామగ్రిని వారికే పంపించడంతో విమర్శలు
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ మరోసారి నవ్వులపాలైంది. భూకంపంతో అతలాకుతలమైన తుర్కియేకు సాయం అందించి విమర్శలు ఎదుర్కొంటోంది. అన్ని దేశాలలాగే తుర్కియేలోని భూకంప బాధితులకు పాకిస్థాన్ ఇటీవల తన వంతుగా సహాయ సామగ్రిని పంపించింది. అనంతరం ఆ సాయాన్ని చూసి ఆశ్చర్యపోవడం తుర్కియే అధికారుల వంతైంది. గతంలో పాక్కు తమ దేశం అందించిన వరద సాయాన్ని అలాగే ప్యాక్ చేసి తిరిగి తమకే పంపించిందని గుర్తించి వారు కంగుతిన్నారు. దీంతో పాక్ తీరుపై ప్రస్తుతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది పాకిస్థాన్లో భీకర వరదలు వచ్చినపుడు తుర్కియే సహాయక సామగ్రిని పంపింది. ఇప్పుడు అదే సామగ్రిని పాక్ మరోసారి ప్యాకింగ్ చేసి అంకారాకు పంపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పైన కొత్త బాక్సులను ఉంచిన పాక్.. లోపల ఉన్న బాక్సులను మార్చడం మర్చిపోయింది. బయటి బాక్సులపైన.. ‘‘భూకంప బాధితుల కోసం పాకిస్థాన్ ప్రజలు పంపిన సాయం’’ అని రాసి ఉంది. లోపల ఉన్న బాక్సుల్లో మాత్రం.. ‘‘వరదల్లో అల్లాడుతున్న పాక్ ప్రజలకు సాయం అందించేందుకు తుర్కియే ప్రజలు పంపుతున్న సామగ్రి ఇది’’ అని రాసి ఉండటంతో పాక్ గుట్టు బయటపడింది. తుర్కియేకు పంపిన ఈ సాయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దగ్గరుండి పర్యవేక్షించడం గమనార్హం. ఈ విషయాన్ని తుర్కియే కాన్సులేట్ జనరల్ పాక్ విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
చర్చనీయాంశమైన పాక్ ప్రధాని తుర్కియే పర్యటన
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తుర్కియే పర్యటన చర్చనీయాంశంగా మారింది. భూకంపం సంభవించిన రెండు రోజుల తర్వాత షరీఫ్, పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఆ దేశానికి వెళ్లాలనుకున్నారు. అయితే భూకంప సహాయక చర్యల్లో తాము తీరిక లేకుండా ఉన్నందున ఆ పర్యటనను వాయిదా వేసుకోవాలని తుర్కియే ప్రభుత్వం పాక్కు సూచించింది. మరోవైపు, ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాలు దిగుమతి చేసుకోవడమే కష్టంగా ఉన్న సమయంలో పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో విదేశీ పర్యటనలకు వెళ్తారా? అంటూ పాక్ ప్రజలు ప్రభుత్వంపై మండిపడ్డారు. అయినప్పటికీ.. షెహబాజ్ రెండు రోజుల క్రితం తుర్కియే వెళ్లి బాధితులను పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్