Africa: కొత్త ఖండం పుడుతోంది!
ప్రపంచ పటం మారబోతోందా? ఖండాలెన్నంటే ఏడుకాదు ఎనిమిదని చెప్పేకాలం రాబోతోందా? అవునంటున్నారు శాస్త్రవేత్తలు.
రెండుగా విడిపోనున్న ఆఫ్రికా
సంకేతాలు ఇప్పటికే మొదలయ్యాయి
ప్రపంచ పటం మారబోతోందా? ఖండాలెన్నంటే ఏడుకాదు ఎనిమిదని చెప్పేకాలం రాబోతోందా? అవునంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుత ఆఫ్రికా ఖండం కొన్ని వేల ఏళ్లలో రెండుగా చీలబోతోందని... వాటి మధ్య సరికొత్త సముద్రం ఏర్పడబోతోందని... ఇప్పటికే ఇందుకు సంబంధించిన సంకేతాలు భూమి లోపలా, మీదా మొదలయ్యాయంటున్నారు భూగర్భ నిపుణులు!
భూభాగం నిరంతరం మారుతూనే వస్తోంది. అయితే ఈ మార్పులు అప్పటికప్పుడు కనిపించేవి కాదు. వీటికి సహజంగానే కొన్ని వేల సంవత్సరాలు పడతాయి. తాజాగా అలాంటి భారీ మార్పే ఆఫ్రికా ఖండంలో చోటుచేసుకోబోతోంది. ఆఫ్రికా రెండుగా చీలి రెండు ఖండాలుగా ఏర్పడబోతోంది. ఈ క్రమంలోనే వీటి మధ్య కొత్తగా ఓ సముద్రం కూడా ఆవిర్భవించే అవకాశాలున్నాయి. ఈ మార్పునే శాస్త్రవేత్తలు తూర్పు ఆఫ్రికా చీలికగా పేర్కొంటున్నారు.
ఏమిటీ పగులు?
భూగర్భంలోని ఒక పలక (టెక్టానిక్ ప్లేట్) రెండుగా విడిపోవటాన్ని శాస్త్రవేత్తలు చీలికగా పరిగణిస్తారు. ఈ పలకలు (టెక్టానిక్ ప్లేట్లు) కదలటం ఆరంభమైనప్పుడు లోయలాంటి పగుళ్లు భూ ఉపరితలంపైనా, భూగర్భంలోనూ ఏర్పడతాయి. 138 మిలియన్ సంవత్సరాల కిందట ఇలాంటి పరిణామం వల్లే దక్షిణ అమెరికా, ఆఫ్రికా రెండు ఖండాలుగా విడిపోయాయి. ఇప్పుడు ఆఫ్రికాలోనూ ఇలాంటి మార్పులే కనిపిస్తున్నాయి. 2005లోనే ఇథియోపియా ఎడారిలో 56 కిలోమీటర్ల పొడవునా భారీ పగులు సంభవించింది. 2018లో కెన్యాలోనూ ఇలాంటిదే భారీ పగులు కనిపించింది. సముద్రం కిందిభాగంలో పలకల కదలికల కారణంగానే ఇది సంభవించిందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆఫ్రికన్ నుబియన్, ఆఫ్రికన్ సొమాలి, అరేబియన్ అనే పలకల వద్ద పగుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కొత్త సముద్రం ఏర్పాటుకు సంకేతంగా భావిస్తున్నారు. ‘‘భూగర్భంలో మొదలయ్యే పగులు.. ఉపరితలం మీదిదాకా చేరి... సముద్ర ఆవిర్భావానికి కారణం కాబోతోంది’’ అని లీడ్స్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు క్రిస్టఫర్ మూర్ తెలిపారు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఎర్రసముద్రంలోని నీరే ఈ పగులులోకి ప్రవేశించి కొత్త సముద్రంగా రూపుదాలుస్తుందంటున్నారు.
వేల కిలోమీటర్ల పొడవునా ఉండే ఈ చీలిక కారణంగా... ప్రస్తుత సోమాలియా, ఇథియోపియా, టాంజానియా, కెన్యాలో కొన్ని ప్రాంతాలు కొత్త ఖండంగా ఏర్పడే అవకాశం ఉంది.
అలాగని ఆఫ్రికా ఇప్పటికిప్పుడు రెండుగా చీలబోదు. ఇప్పటికే మొదలైన ఈ ప్రక్రియ పూర్తవటానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. కొత్త సముద్రం ఆవిర్భవించటానికి 5-10 మిలియన్ సంవత్సరాలు పట్టొచ్చు. ఇప్పుడు సముద్రం లేని ఉగాండా, జాంబియాలకు తీరప్రాంతం వస్తుంది. ‘‘చీలికలోయలో తూర్పుభాగంలో మార్పులు వేగంగా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ రూపుదాల్చటానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది’’ అని నైరోబీ విశ్వవిద్యాలయంలో భూగర్భశాస్త్ర విభాగం పరిశోధకుడు ఎడ్విన్ డిండి వివరించారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్