65 వేల హెచ్1బీ వీసాల రిజిస్ట్రేషన్లు పూర్తి
అమెరికా ఇమ్మిగ్రేషన్ సేవల సమాఖ్య ఏజెన్సీ గణాంకాల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరానికి పరిమితి విధించిన మేరకు 65,000 హెచ్1బీ వీసా దరఖాస్తులకు ఈ - రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
వాషింగ్టన్: అమెరికా ఇమ్మిగ్రేషన్ సేవల సమాఖ్య ఏజెన్సీ గణాంకాల ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరానికి పరిమితి విధించిన మేరకు 65,000 హెచ్1బీ వీసా దరఖాస్తులకు ఈ - రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాగా పరిగణించే హెచ్1బీ అమెరికన్ కంపెనీలు ప్రత్యేక వృత్తుల్లో, సాంకేతిక నైపుణ్యం అవసరమున్న పనుల్లో విదేశీ అభ్యర్థులను చేర్చుకునేందుకు అనుమతిస్తుంది. భారత్, చైనా వంటి దేశాల నుంచి వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకునే ఈ కేటగిరీ అభ్యర్థులపై అమెరికన్ సాంకేతిక కంపెనీలు ఆధారపడుతుంటాయి. యూఎస్ కాంగ్రెస్ విధించిన పరిమితి మేర ఖరారు చేసిన 65 వేల వీసాల్లో ఉపయోగించనివాటిని వచ్చే ఆర్థిక సంవత్సరానికి అర్హమైనవిగా పరిగణిస్తారు. హెచ్1బీ వీసాలకు ఉన్న అధిక డిమాండు దృష్ట్యా జారీ ప్రక్రియలో సంస్కరణల కోసం ఎప్పటినుంచో అభ్యర్థనలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న వీసాల సంఖ్యను పెంచాలని, దరఖాస్తు ప్రక్రియను సరళీకృతం చేయాలని చాలాకాలంగా కోరుతున్నారు. సాంకేతికంగా, ఆవిష్కరణల పరంగా నేడు ప్రపంచస్థాయిలో తనకున్న ఉన్నతస్థానాన్ని అమెరికా నిలబెట్టుకోవాలంటే హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియ చాలా కీలకమని అధికారవర్గాలు చెబుతున్నాయి.
60 రోజుల్లోపు అమెరికా వీడాలన్నది అవాస్తవం
సాంకేతికరంగంలో కొనసాగుతున్న తొలగింపుల నేపథ్యంలో హెచ్1బీ వీసా ఉండీ, తొలగింపునకు గురైన ఉద్యోగులు 60 రోజుల్లోపు అమెరికా వీడాలన్నది వాస్తవం కాదని అమెరికా ఇమ్మిగ్రేషన్ సేవల సమాఖ్య ఏజెన్సీ స్పష్టం చేసింది. ఇటువంటి ఉద్యోగులకు అమెరికాలో కొనసాగేందుకు బహుళ అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు భారత ఫౌండేషన్, భారత వలసల అధ్యయన కేంద్రానికి యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఓ లేఖ రాస్తూ.. ‘‘ముఖ్యంగా సాంకేతికరంగంలో అసంకల్పిత తొలగింపుల సమస్య తీవ్రత మాకు తెలుసు. బాధిత కుటుంబాల ఆర్థిక, భావోద్వేగ పరమైన సమస్యలను అర్థం చేసుకోగలం’’ అని తెలిపారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమేజాన్ వంటి కంపెనీలు ఈ మధ్య వరుసగా ఉద్యోగులను తొలగించాయి. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. ‘‘వాషింగ్టన్ పోస్ట్’’ కథనం మేరకు.. గతేడాది నవంబరు నుంచి రెండు లక్షల ఐటీ ఉద్యోగులను తొలగించారు. ఇందులో 30 నుంచి 40 శాతం మేర హెచ్1బీ, ఎల్1 వీసాలున్న భారతీయ ఐటీ నిపుణులే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరంతా నిబంధనల మేరకు 60 రోజుల్లోపు.. నాన్-ఇమ్మిగ్రెంట్ హోదా మార్పునకు లేదా హోదా సర్దుబాటునకు దరఖాస్తు చేసుకోవాలని యూఎస్సీఐఎస్ తెలిపింది. అలాగే ‘బలవంతపు పరిస్థితులు’ సూచించే ఉపాధి అధికార పత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా యజమానిని మార్చే దరఖాస్తు ద్వారా లబ్ధి పొందవచ్చు. అరవై రోజుల్లోపు ఇందులో ఏ ఒక్క దరఖాస్తు చేసినా మరో 60 రోజులపాటు ఇక్కడే ఉండే వెసులుబాటు లభిస్తుంది. ఇందులో ఏ దరఖాస్తు చేయనివారు మాత్రమే గడువు ముగిసిన వెంటనే అమెరికా వీడాల్సి ఉంటుందని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ తన లేఖలో వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!