పగడపు దిబ్బలకు వేడి సెగ!
సముద్ర జలాలు వేడెక్కడం పగడపు దిబ్బల ఉనికికి చేటు తెస్తోంది. అమెరికాలో ఫ్లోరిడా రాష్ట దక్షిణ తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత జులై నెల మధ్యలో కూడా 32 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది.
కొంపముంచుతున్న భూతాపం
వాషింగ్టన్: సముద్ర జలాలు వేడెక్కడం పగడపు దిబ్బల ఉనికికి చేటు తెస్తోంది. అమెరికాలో ఫ్లోరిడా రాష్ట దక్షిణ తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత జులై నెల మధ్యలో కూడా 32 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. దక్షిణ అమెరికా ఖండంలోనూ, మధ్య అమెరికా దేశాల్లోనూ కూడా ఇదే పరిణామం సంభవిస్తూ పగడపు దిబ్బలపై దుష్ప్రభావం చూపుతోంది. అట్లాంటిక్, తూర్పు పసిఫిక్ మహాసముద్ర జలాలూ తీవ్రంగా వేడెక్కడం పగడపు దిబ్బలకు అనర్థాన్ని తెస్తోంది. మనుషుల్లానే పగడపు దిబ్బలూ అతి వేడిని తట్టుకోలేవు. సముద్ర జలాలు వేడెక్కడానికి ఈ ఏడాది ఎల్నినో కారణమైనా దీర్ఘకాలంలో మానవ కార్యకలాపాల వల్ల భూతాపం పెరిగి ఇబ్బందులకు కారణమవుతోంది.
సముద్రాల్లో పగడపు దిబ్బలు భూమిపై అమెజాన్ వర్షాధార అడవుల తరహాలో అపార జీవ వైవిధ్యానికి నెలవులు. అవి చేపలు, రొయ్యలు తదితర జలచరాలకు ఆహారం అందిస్తాయి. మనోహరమైన పగడపు దిబ్బలను వీక్షించడానికి పర్యాటకులు సముద్రాల్లో స్కూబా డైవింగ్ చేస్తారు. అక్కడ చేపల వేట జోరుగా సాగుతుంది. ఇలా పర్యాటక రంగం ద్వారా తీర దేశాలకు ఏటా వందల కోట్ల డాలర్ల ఆదాయం వస్తోంది. పగడపు దిబ్బలు తుపానుల సమయంలో భీకర అలల ధాటిని తగ్గిస్తూ తీరంలోని భవనాలు, ఇతర మౌలిక వసతులను రక్షిస్తాయి.
పగడపు దిబ్బల్లో నివసించే జూక్సాంథెల్లే సూక్ష్మ నాచు (ఆల్గే) అచ్చం మొక్కల్లానే కిరణజన్య సంయోగ క్రియ జరుపుతూ జలచరాలకు ఆహారాన్ని అందిస్తాయి. తమ చుట్టూ సముద్రపు నీరు వేడెక్కితే జాక్సాంథెల్లే ఆల్గే ఆ దిబ్బలను విడచివెళ్లిపోతాయి. దీంతో పగడపు దిబ్బలు ఎరుపు రంగు కోల్పోయి తెల్లగా మారిపోతుంది. దీన్నే బ్లీచింగ్ అంటారు. ఫ్లోరిడా కీస్ తీర జలాల్లో 90 శాతం దిబ్బల్లో బ్లీచింగ్ కనిపిస్తోంది. కొలంబియా, మెక్సికో, కోస్టారికా దేశాల తీరాల్లోనూ పగడపు దిబ్బల బ్లీచింగ్ సంభవిస్తోంది. సముద్ర జలాలు వేడెక్కుతున్న కొద్దీ జూక్సాంథెల్లే సూక్ష్మ నాచు జీవులు పగడు దిబ్బలను వదలివేయడం ఎక్కువై వినాశం సంభవిస్తుంది.
దీన్ని నివారించడమెలా అని అమెరికాలో పరిశోధనలు సాగుతున్నాయి. ఆటుపోట్ల వల్ల సముద్ర తీరంలో ఏర్పడే నీటి చెలమల్లో పగడపు దిబ్బలు వేర్వేరు ఉష్ణోగ్రతలను చవిచూస్తూ కూడా జీవిస్తున్నాయి. ఈ ప్రక్రియను ప్రయోగశాలలో కూడా పునరావృతం చేయగలమా అని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. అలా ప్రయోగశాలలో పెంచిన పగడపు జీవులను సముద్రంలో ప్రవేశపెడితే అవి అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతాయని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. చివరి బ్యాచ్ స్వదేశానికి బయల్దేరినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి ఓ వార్తాసంస్థకు వెల్లడించారు. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది. -
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
వేర్పాటువాదానికి, హింసను సమర్థించేవారికి మద్దతు ఇవ్వడమనేది భావప్రకటన స్వేచ్ఛకు అర్థం కాదని కేంద్ర మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. -
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
వివాహ బంధంలో కొత్త ట్రెండ్ను ఫాలో అవుతోన్న జపాన్ యువత.. పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ధోరణి వైపు అడుగులు వేస్తోంది. -
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
భారత ఎన్నికల విషయంలో తమ ప్రమేయం ఉండదని అమెరికా (USA) స్పష్టం చేసింది. రష్యా ఆరోపణలను ఖండించింది. -
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
ఫోరిడాలో పోలీసులు ఓ అపార్ట్మెంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ నల్లజాతీయుడు మృతి చెందడంతో అక్కడ నిరసన వ్యక్తమైంది. -
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!