Germany: వలసదారులకు ఐదేళ్లకే పౌరసత్వం..! సంస్కరణలకు జర్మనీ ఆమోదం
పౌరసత్వ కల్పన విషయంలో జర్మనీ సంస్కరణల బాటపట్టింది. కొత్త చట్టం ప్రకారం స్థానికంగా ఐదేళ్లుగా నివసిస్తోన్నవారు పౌరసత్వం పొందేందుకు అర్హులు.
బెర్లిన్: వలసల సంఖ్యను పెంచేందుకు జర్మనీ (Germany) సిద్ధమైంది. దేశ పౌరసత్వం (German Citizenship), ద్వంద్వ పౌరసత్వం (Dual Citizenship) విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు, ఆంక్షల సడలింపు దిశగా చర్యలు తీసుకుంది. ఈ మేరకు రూపొందించిన ప్రణాళికను చట్టసభ్యులు ఆమోదించారు. ఓలాఫ్ షోల్జ్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లు పార్లమెంటు (Bundestag)లో 382- 234 ఓట్ల తేడాతో నెగ్గింది. ఈ సంస్కరణలు వలసదారుల ఏకీకరణను ప్రోత్సహిస్తాయని, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని ఆకర్షించడంలో సహాయపడతాయని ప్రభుత్వం చెబుతోంది.
ప్రస్తుత చట్టం ప్రకారం.. జర్మనీలో ఎనిమిదేళ్లు నివసిస్తేనే పౌరసత్వం పొందేందుకు అర్హులు. ప్రత్యేక సందర్భాల్లో ఐదేళ్లకు అవకాశం కల్పిస్తారు. తాజాగా దీన్ని ఐదేళ్లు, మూడేళ్లకు తగ్గించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు స్థానికంగా ఎనిమిదేళ్లుగా చట్టబద్ధంగా నివాసం ఉంటే.. ఇక్కడ జన్మించే పిల్లలు పుట్టుకతో జర్మనీ పౌరులుగా మారతారు. నూతన ప్రణాళికలో దీన్ని ఐదేళ్లకు తగ్గించారు. ఈయూ దేశాలు, స్విట్జర్లాండ్ మినహా ఇతర దేశాల పౌరులు జర్మనీ పౌరసత్వం పొందినప్పుడు వారి మునుపటి జాతీయతను వదులుకోవాల్సి వచ్చేది. కొన్ని మినహాయింపులు ఉండేవి. ఇప్పుడు ఈ ఆంక్షలు తొలగిపోనున్నాయి.
జర్మనీ 8.44 కోట్ల జనాభాలో 1.2 కోట్ల మందికి స్థానిక పౌరసత్వం లేదు. వారిలో 53 లక్షల మంది దాదాపు పదేళ్లుగా ఇక్కడ నివసిస్తున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. 2022లో దాదాపు 1.68 లక్షల మందికి పౌరసత్వం లభించింది. ‘‘తాజా సంస్కరణలు జర్మనీని ఫ్రాన్స్ వంటి పొరుగు దేశాలకు పోటీగా నిలుపుతాయి. నైపుణ్యం కలిగిన వ్యక్తులకు మేం కూడా కెనడా, అమెరికాల మాదిరి ఆఫర్లు అందించాలి. పౌరసత్వం కూడా ఇందులో ఒక భాగమే’’ అని అంతర్గత వ్యవహారాల మంత్రి నాన్సీ ఫేజర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.