Hamas: కాల్పుల విరమణపై చర్చలు నిలిపివేసిన హమాస్
సలేహ్ అరౌరీపై దాడితో హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కాల్పుల విరమణపై చర్చలు నిలిచిపోయాయి.
ఇంటర్నెట్డెస్క్: తమ సంస్థ అగ్రనేత సలేహ్ అరౌరీని ఇజ్రాయెల్ డ్రోన్ మట్టుపెట్టడంపై హమాస్ (Hamas) ఆగ్రహంగా ఉంది. గాజాలో మిగిలిన బందీల విడుదల, కాల్పుల విరమణ కోసం జరుగుతున్న చర్చలను నిలిపివేసింది. ఈ విషయాన్ని అల్ అరేబియా వార్తా సంస్థ పేర్కొంది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా స్పందిస్తూ.. అరౌరీ హత్యను ఉగ్ర చర్యతో పోల్చారు. లెబనాన్ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ ధిక్కరించిందన్నారు. ఈ దాడికి ముందు.. హమాస్-ఇజ్రాయెల్ మధ్య డీల్ కుదిరే అవకాశం ఉందన్న వాదనలు వినిపించాయి. ఇప్పటికీ హమాస్ చెరలో 129 మంది ఉన్న విషయం తెలిసిందే.
బందీల కుటుంబీకులు మంగళవారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కలిసి హమాస్తో ఒప్పందం కోసం ఒత్తిడి చేశారు. తాము ఇప్పటికీ చర్చలు కొనసాగిస్తున్నామని.. వీటికి తుది గడువు విధించలేదని ఇజ్రాయెల్ ప్రధాని అన్నారు.
ఎవరీ సలేహ్ అరౌరీ..?
సలేహ్ అరౌరీ హమాస్ అల్-కస్సం బ్రిగేడ్ వ్యవస్థాపకుల్లో ఒకడు. లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ చేపట్టిన ఈ డ్రోన్ దాడి.. 2006 తర్వాత అతిపెద్దది. ఇజ్రాయెల్ బయట కూడా హమాస్ నాయకత్వాన్ని వేటాడుతామని నెతన్యాహు ప్రభుత్వం చేసిన ప్రకటనలో భాగంగానే ఈ దాడి జరిగింది. దీనిని లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి ఖండించారు. తమ దేశాన్ని సంక్షోభంలోకి లాగేందుకు జరిగిన దాడిగా అభివర్ణించారు. సలేహ్ అరౌరీ 2010 నుంచి హమాస్ పొలిట్బ్యూరో సభ్యుడు. ఈ సంస్థ ఉపనేతగా 2017లో ఎన్నికయ్యాడు. ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్ షలిట్ అప్పగింత ఒప్పంద చర్చల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇరాన్-హమాస్ మధ్య సంబంధాల బలోపేతంలో అరౌరీ పాత్రే చాలా కీలకం. అతడి మరణం ఒక రకంగా ఇరాన్కూ ఇబ్బందికరమే. 2015లో అరౌరీని అమెరికా గ్లోబల్ టెర్రరిస్ట్గా పేర్కొంది. అతడి సమాచారం అందిస్తే 5 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. బీరుట్లో అరౌరీపై డ్రోన్ దాడి సమాచారాన్ని ఇజ్రాయెల్ గోప్యంగా ఉంచింది. తన మిత్రదేశమైన అమెరికాతో కూడా ముందుగా పంచుకోలేదు.
అల్-షిఫాను కమాండ్ సెంటర్గా వాడారు..
గాజాలోని అల్-షిఫా హాస్పిటల్ను హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ సంస్థలు కమాండ్ సెంటర్గా వాడుకొన్నాయని అమెరికా ధ్రువీకరించింది. డీక్లాసిఫైడ్ అమెరికా ఇంటెలిజెన్స్ సమాచారం దీనిని వెల్లడించింది. హమాస్, పీఐజే సంస్థలు ఇక్కడ బందీలను దాచినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ దళాలు దీనిలో ప్రవేశించడానికి ముందు వారిని తరలించినట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?