Srilanka Crisis: శ్రీలంక సర్కార్ మెడపై అవిశ్వాసం కత్తి.. రాజీనామా రద్దు చేసుకున్న ఆర్థికమంత్రి!
తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంధన ధరలు, నిత్యావసరాలు ఆకాశాన్ని.......
ఇంటర్నెట్ డెస్క్: తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న శ్రీలంకలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంధన ధరలు, నిత్యావసరాలు ఆకాశాన్ని తాకడంతో తినడానికి నానా అవస్థలు పడుతున్న జనం రాజపక్స ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో జనం చెప్పేది వినకపోతే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు పలు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు, మంత్రి పదవి చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తన రాజీనామా రద్దు చేసుకున్నట్టు ఆర్థిక మంత్రి అలీ సాబ్రే స్పష్టంచేశారు. శ్రీలంకలో ఈరోజు జరిగిన కొన్ని కీలక పరిణామాలివీ..
- శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రభుత్వం ప్రజలు చెప్పింది వినకపోతే రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వస్తుందని ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస హెచ్చరించారు. ఓట్లు వేసి గెలిపించిన జనాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. ప్రజల వద్దకు ఎలా తిరిగి వెళ్లగలరో నిర్ణయించుకోండని ప్రభుత్వానికి సూచించారు.
- ఔషధాల కొరత శ్రీలంకను వేధిస్తుండటంతో అక్కడ ఆరోగ్య వ్యవస్థ కుదేలైంది. ఆస్పత్రుల్లో తగిన మందుల్లేకపోవడంతో దేశంలోని పలు చోట్ల వైద్యులు, నర్సులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రత్మలానాలో స్టేట్ ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. మందుల కొరతను తీర్చేందుకు తక్షణమే పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేస్తున్నారు.
- ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక రాబోయే రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంధన సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు 500 మిలియన్ డాలర్ల విలువైన చమురును లైన్ ఆఫ్ క్రెడిట్గా భారత్ అందిస్తుండగా.. దీన్ని శ్రీలంక వేగంగా వినియోగించుకుంటోంది. ఈ నెలాఖరుకు ఈ చమురు నిల్వలు కూడా తరిగిపోనున్నాయి. ఒకవేళ భారత్ నుంచి ఈ సహాయం కొనసాగింపు లేకపోతే శ్రీలంకలో డీజిల్ బంకులు మళ్లీ ఖాళీ అయ్యే ప్రమాదం ఉందంటూ పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
- మంత్రి పదవికి రాజీనామా చేసినా ఇప్పటికీ తమ దేశ ఆర్థిక మంత్రి అలీ సబ్రీయేనని అధికార పార్టీకి చెందిన ఎంపీ కాంచన విజెశేఖర అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పార్లమెంట్లో మాట్లాడారు. అలీ సబ్రే మంత్రి పదవికి రాజీనామా చేస్తూ ఇచ్చిన లేఖను అధ్యక్షుడు గొటబాయ ఆమోదించేదన్నారు. దీంతో ఆయనే ఆర్థికమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. ఇటీవల కొత్త ఆర్థిక మంత్రిగా సాబ్రే నియమితులవ్వగా.. 24గంటల్లోనే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
- తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు యూరోపియన్ యూనియన్ కీలక సూచన చేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)తో లోతుగా చర్చించి.. కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు అవసరమైన సంస్కరణలపై చర్చించాలని సూచించింది.
- దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి పదవి చేపట్టేందుకు ఎవరూ ఇష్టపడకపోవడంతో తన రాజీనామాను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని అలీ సాబ్రే పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. ‘‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఈ బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ఇష్టపడటంలేదు. అందుకే ఎలాంటి సవాళ్లు ఎదురైనా దేశ ఆర్థిక వ్యవస్థని కాపాడేందుకే ఆర్థికమంత్రిగా కొనసాగాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు.
- ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు ఆస్ట్రేలియా ఆపన్న హస్తం అందించేందుకు ముందుకొచ్చింది. ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు వీలుగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO)ల ద్వారా 2.5 మిలియన్ డాలర్లు సమకూర్చనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
- రాజపక్స సర్కార్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాము మద్దతుగా నిలుస్తామని జేవీపీ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు విజిత హెరాత్ ప్రకటించారు. ప్రజల డిమాండ్ మేరకు అధ్యక్షుడు రాజీనామాకు నిరాకరిస్తే అభిశంసనకు కూడా వెళ్తామని హెచ్చరించారు. ప్రజలు నాయకత్వ మార్పు కోరుకుంటున్నారనీ.. ప్రభుత్వం ఇలాగే ఏకపక్షంగా వ్యవహరిస్తే అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతుగా నిలుస్తామని వ్యాఖ్యానించారు.
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఎస్జేబీ నిర్ణయించినట్టు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు.
- శ్రీలంక కొత్త ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా మహింద సిరివర్దనె బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన శ్రీలంక సెంట్రల్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్గా, ఎకనమిక్ రీసెర్చి డెవలప్మెంట్ డైరెక్టర్గా పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. చివరి బ్యాచ్ స్వదేశానికి బయల్దేరినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి ఓ వార్తాసంస్థకు వెల్లడించారు. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది. -
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
వేర్పాటువాదానికి, హింసను సమర్థించేవారికి మద్దతు ఇవ్వడమనేది భావప్రకటన స్వేచ్ఛకు అర్థం కాదని కేంద్ర మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. -
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
వివాహ బంధంలో కొత్త ట్రెండ్ను ఫాలో అవుతోన్న జపాన్ యువత.. పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ధోరణి వైపు అడుగులు వేస్తోంది. -
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
భారత ఎన్నికల విషయంలో తమ ప్రమేయం ఉండదని అమెరికా (USA) స్పష్టం చేసింది. రష్యా ఆరోపణలను ఖండించింది. -
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
ఫోరిడాలో పోలీసులు ఓ అపార్ట్మెంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ నల్లజాతీయుడు మృతి చెందడంతో అక్కడ నిరసన వ్యక్తమైంది. -
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!