Imran Khan: ఇమ్రాన్ఖాన్ ఆ నటులను మించిపోయారు..!
ఇమ్రాన్ఖాన్పై పాక్లోని ఇతర రాజకీయ పార్టీల నాయకులు మండిపడుతున్నారు. ఆయనపై జరిగిన దాడిని ఓ డ్రామాగా అభివర్ణిస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఇటీవల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ డ్రామా చేస్తున్నారని అక్కడి రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్మెంట్ అధినేత మౌలాన ఫజ్లూర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. ఇమ్రాన్పై దాడిని ఓ డ్రామాగా అభివర్ణించారు. ఇమ్రాన్ నటనా చాతుర్యంలో.. సల్మాన్ఖాన్, షారుఖ్ ఖాన్లను మించిపోయారని ఎద్దేవా చేశారు. వజీరాబాద్ ఘటన తర్వాత తనకు ఇమ్రాన్పై సానుభూతి కలిగిందని ఆయన పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు ఇమ్రాన్ డ్రామా చేస్తున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్పై ఎన్ని తూటాలు కాల్చారు.. ఎన్ని చోట్ల గాయాలయ్యాయి అన్న అంశాలపై ఆయన సందేహాలు లేవనెత్తారు. దాడి జరిగిన వెంటనే ఖాన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించకుండా లాహోర్కు తీసుకువెళ్లడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఖాన్ అబద్ధాలను గుడ్డి జనం కూడా నమ్ముతున్నారని ఆయన అన్నారు. బాంబు శకలాల గురించి విన్నాం కానీ.. తూటా శకలాల గురించి ఇప్పుడే తొలి సారి వింటున్నామని ఫజ్లూర్ అన్నారు. అయినా బుల్లెట్ గాయాలకు క్యాన్సర్ వైద్యశాలలో చికిత్స ఎందుకు చేయించారని ప్రశ్నించారు.
పాకిస్థాన్లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్తో ఇమ్రాన్ఖాన్ గతనెల 28న లాంగ్మార్చ్ను ప్రారంభించారు. ఈ ర్యాలీ గురువారం పంజాబ్ రాష్ట్రం వజీరాబాద్లోని అల్లాహోచౌక్కు చేరుకోగా.. ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. తూటా దూసుకెళ్లడంతో మాజీ ప్రధాని కాలికి గాయాలయ్యాయి. లాహోర్లోని షౌకత్ ఖనూమ్ ఆసుపత్రిలో వైద్య నిపుణులు ఇమ్రాన్కు శస్త్రచికిత్స చేశారు. ఆయన్ను ఈ ఆదివారం ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు. కాల్పులు జరిగిన వెంటనే కాన్వాయ్లోని భద్రతాధికారులు నిందితుడిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
ఈక్వెడార్ సోషల్ మీడియా స్టార్, మోడల్ లాండీ పరాగా హత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టా వేదికగా చేసిన పోస్టు సహాయంతో ఆమెను నిందితులు హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. -
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
Canada: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. -
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు