viral news: లైవ్లో అతిగా మద్యం తాగి.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మృతి..!
చైనాలో సోషల్ మీడియాలో ఛాలెంజ్లు ప్రాణాలు తీసే స్థాయికి వచ్చాయి. ఓ ఇన్ఫ్లుయెన్సర్ ఇటీవల లైవ్లో అతిగా మద్యం తాగి మరణించాడు.
ఇంటర్నెట్డెస్క్: చైనా(china)కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఓ ఛాలెంజ్లో భాగంగా వరుసగా బాటిళ్ల కొద్ది మద్యం తాగి ప్రాణాలు కోల్పోయాడు. చైనీస్ వోడ్కాగా పేరున్న బైజ్యూ అనే దేశీయ మద్యం తాగడం వల్ల అతడు చనిపోయాడు. ఈ ఘటన ఝాంగ్సూ ప్రావిన్స్లో చోటు చేసుకొంది. చైనా వెర్షన్ టిక్టాక్ డుయిన్లో సాంక్యూయాంజ్గా పేరున్న ఇన్ఫ్లూయెన్సర్ మే16 తెల్లవారుజామున ‘పీకే’ అనే ఛాలెంజ్లో మరో ఇన్ఫ్లూయెన్సర్తో పోటీపడ్డాడు. ఈ పోటీలో విజేతలకు వీక్షకుల నుంచి గిఫ్ట్లు, ప్రోత్సాహకాలు అందుతాయి. ఓడిపోయిన వారికి శిక్షలు కూడా ఉంటాయి. ఈ పోటీలో ఓడిపోయినందుకు శిక్షగా అతడు పలు బాటిళ్ల బైజ్యూను ఎటువంటి విరామం లేకుండా తాగాల్సివచ్చింది. ఈ క్రమంలో అతడు కనీసం నీటిని కూడా తీసుకోలేదు.
ఈ క్రమంలో సదరు లైవ్స్ట్రీమ్ను అర్ధరాత్రి తర్వాత ముగించాడు. మర్నాడు మధ్యాహ్నానికి అతడు మరణించాడు. సాంక్యూయాంజ్ అసలు పేరు వాంగ్. ఈ ఘటనపై అతడి స్నేహితుడు ఝావో మాట్లాడుతూ తొలుత తాను చూసేటప్పటికి ఎన్ని బాటిళ్లు తాగాడో తెలియలేదని పేర్కొన్నాడు. ఆ తర్వాత తాను వచ్చేటప్పటికే మూడు బాటిళ్లను పూర్తిచేసినట్లు గుర్తించాన్నారు. వాంగ్ ఇటీవలే తన గదిలో చేరాడని ఝావో పేర్కొన్నాడు. అతడి గొడవ దెబ్బకు మిత్రులు ఎవరూ రూమ్లు ఇవ్వలేదని పేర్కొన్నాడు.
చైనాలోని సోషల్ మీడియా మార్కెట్లో విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో ఇన్ఫ్లూయెన్సర్ లైవ్స్ట్రీమ్లు ఎక్కువ మంది వీక్షకులను సొంతం చేసుకొనేందుకు అన్ని హద్దులను దాటేస్తున్నాయి. ఈ నెల మొదట్లో ఇన్ఫ్లూయెన్సర్ ఇంటిపైన చిక్కుకొన్నట్లుగా నటించాడు. అతడిని అగ్నిమాపక సిబ్బంది వచ్చి రక్షించగా.. దానిని కూడా చిత్రీకరించి ఆన్లైన్లో పోస్టు చేశాడు. గతేడాది చైనా ప్రభుత్వం లైవ్ స్ట్రీమర్లపై పలు ఆంక్షలు విధించింది. దీంతోపాటు హద్దులు మీరిన లైవ్స్ట్రీమర్లపై నిషేధం కూడా విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
Brazil floods: బ్రెజిల్లో వరదల కారణంగా దాదాపు 60 మంది మృతి చెందారు. మరో 70 మంది ఆచూకీ గల్లంతైంది. దాదాపు 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. -
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్లోని హ్యూస్టన్ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!