Iran: ఇజ్రాయెల్ ‘మొస్సాద్’తో సంబంధాలు.. నలుగురిని ఉరితీసిన ఇరాన్..!
Iran: ఇజ్రాయెల్ నిఘా సంస్థ ‘మొస్సాద్’తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులకు ఇరాన్ మరణ దండన అమలు చేసింది. మరికొంతమందిని జైలుకు పంపించింది.
టెహ్రాన్: హమాస్ (Hamas) ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా గాజాపై ఇజ్రాయెల్ చేపడుతోన్న దాడులను ఇరాన్ (Iran) తీవ్రంగా ఖండిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ (Israel) ఇంటెలిజెన్స్ సంస్థ ‘మొస్సాద్ (Mossad)’కు పనిచేస్తున్నారన్న ఆరోపణలపై నలుగురు వ్యక్తులను ఇరాన్ శుక్రవారం ఉరితీసింది. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
కొంతమంది ఇరాన్ భద్రతా సిబ్బందిని కిడ్నాప్ చేసి, వారి నుంచి రహస్య సమాచారాన్ని సేకరించారని ఆ నలుగురిపై అభియోగాలు నమోదయ్యాయి. అంతేగాక, ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు చెందిన కార్లు, అపార్ట్మెంట్లను కూడా వీరు ధ్వంసం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలు రుజువుకావడంతో వీరికి మరణశిక్ష అమలు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక, ‘మొస్సాద్’ సంస్థ కోసం పనిచేస్తున్న మరికొంతమంది ఏజెంట్లకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే, ఎంతమందికి జైలు శిక్ష పడిందన్న వివరాలు తెలియరాలేదు.
హౌతీ దాడులను తిప్పికొట్టి.. 18 నౌకలను కాపాడి..!
గత సోమవారం (డిసెంబరు 25) సిరియాలోని డమాస్కస్ నగరం సమీపంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఇరాన్కు చెందిన ఆర్మీ సలహాదారు రజీ మౌస్సావీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే మొస్సాద్ ఏజెంట్లను ఇరాన్ ఉరితీయడం గమనార్హం. ఈ నెల ఆరంభంలోనూ మొస్సాద్కు పనిచేస్తున్న ఓ గూఢచారికి ఇరాన్ మరణశిక్ష అమలు చేసింది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొన్నేళ్లగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ను ఇజ్రాయెల్ తన అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా అడ్డుకునేందుకు సైనిక చర్యకూ వెనుకాడబోమని గతంలో హెచ్చరించింది. అటు ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాల కోసం గూఢచర్యం చేస్తున్న వ్యక్తులను నిర్బంధించి వారికి కఠిన శిక్షలు అమలు చేస్తోంది. 2020లో ఇరాక్లో అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఓ ఇరాన్ జనరల్ గురించి అమెరికా, ఇజ్రాయెల్లకు సమాచారాన్ని లీక్ చేసినందుకుగానూ ఓ వ్యక్తిని ఉరితీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!