Attacks on ships: నౌకలపై దాడులు.. భారత ప్రయోజనాలకు ముప్పే: జైశంకర్ ఆందోళన
హిందూ మహా సముద్రంలో ఇటీవల భారత్కు సమీపంలో నౌకలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. వీటిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(S Jaishankar) స్పందించారు.
ఇంటర్నెట్డెస్క్: మన దేశానికి సమీపంలో నౌకలపై దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(S Jaishankar) అన్నారు. ఈ ఘటనలు దేశ ఆర్థిక, ఇంధన ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్న మంత్రి.. అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ఈ మేరకు స్పందించారు.
‘ఇటీవల కాలంలో హిందూ మహా సముద్రంలోని వాణిజ్య నౌకల భద్రతకు ముప్పు పెరిగింది. భారత్కు సమీపంలో ఈ తరహా దాడులు జరిగాయి. ఈ పరిస్థితులు ఆందోళనకరమైనవి. ఇవి భారత్ ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఈ గందరగోళ పరిస్థితి ఏ ఒక్కరికీ ప్రయోజనకరం కాదు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించడం అవసరం. ఇటీవల పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఇండియా, ఇరాన్ ఆందోళన చెందుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు, ఘర్షణలు మరింత పెరగకుండా నిరోధించాలి’ అని జై శంకర్(S Jaishankar) అన్నారు.
మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబెల్స్.. యూఎస్ నౌకపై క్షిపణులతో దాడి
ఇజ్రాయెల్-హమాస్ (Israel-Hamas) యుద్ధం వేళ ఇరాన్ మద్దతున్న హౌతీ రెబెల్స్ ఇటీవల ఎర్ర సముద్రం (Red Sea)లో నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం భారత్ (India)కు వస్తున్న వాణిజ్య నౌక (Ship)పై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి (Drone Strike) జరిగింది. ఆ తర్వాత కొద్దిరోజులకే సోమాలియా తీరంలో మరో నౌక హైజాక్కు గురైంది. ఈ రెండు నౌకల్లో భారత సిబ్బంది విధుల్లో ఉన్నారు. మన నౌకాదళం రంగంలోకి దిగి, వారిని రక్షించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్లో జై శంకర్ పర్యటన జరుగుతోంది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో గాజాలో నెలకొన్న పరిస్థితులపై జై శంకర్ మాట్లాడారు. ‘గాజాలో జరుగుతోన్న ప్రాణ నష్టాన్ని నివారించడంపైనే మా దృష్టంతా ఉంది. అక్కడ నెలకొన్న మానవతా సంక్షోభానికి పరిష్కారం చూపాలి’ అని కోరారు. ఆ దిశగా అంతర్జాతీయ సమాజం చేస్తోన్న కృషిని స్వాగతించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!