Joe Biden: స్టేజ్పై జో బైడెన్.. చెయ్యి పట్టుకుని సాయం చేసిన జిల్ బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్టేజ్ పై నుంచి కిందకు వచ్చేందుకు ఆయన సతీమణి జిల్ బైడెన్ సాయం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) స్టేజ్పై ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా ఆయన సతీమణి సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. 2021 జనవరి 6వ తేదీన జరిగిన అల్లర్లను గుర్తు చేసుకుంటూ ప్రసంగించిన తర్వాత స్టేజ్పై నుంచి ఆయనను జిల్ బైడెన్ (Jill Biden) చెయ్యి పట్టుకుని తీసుకువచ్చారు. గతంలో ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన పలుమార్లు గందరగోళ పరిస్థితికి గురయ్యారు. స్టేజ్పైనే ఉండి గాల్లోనే కరచాలనం చేయడం, ఎటువైపు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాంటివి పునరావృతం కాకుండా వైట్ హౌస్ సిబ్బంది జిల్ బైడెన్ను స్టేజ్పైకి అనుమతించినట్లు ‘ఫాక్స్ న్యూస్’ పేర్కొంది.
ట్రంప్ అనర్హత కేసుపై సత్వరమే విచారణ
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జో బైడెన్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ట్రంప్ అధికారంలోకి రావడం కోసం ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడతారు. నాజీ జర్మన్ మనస్తత్వం కలిగిన ఆయన తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. విద్వేషపూరిత ప్రసంగాలతో అమెరికన్ల మనసులను విషపూరితం చేస్తున్నారు’’ అని బైడెన్ ఆరోపించారు. అమెరికా అధ్యక్ష పదవికి ఇప్పటి వరకు ఎన్నికైన వారిలో జో బైడెన్ (81) అతి పెద్ద వయస్కుడు. డెమొక్రటిక్ పార్టీ తరపున మరోసారి ఆయన అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.