Joe Biden: అమెరికాలోని యూఎస్ అంటూ బైడెన్ వ్యాఖ్య.. రిపబ్లికన్ల విమర్శలు
అమెరికాలోని యూఎస్ అంటూ అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలు రిపబ్లికన్లకు ప్రచారాస్త్రంగా మారాయి. ఆయన దేశం గురించి మర్చిపోయారని విమర్శలు చేస్తున్నారు.
వాషింగ్టన్: అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని యూఎస్లో తక్కువ ద్రవ్యోల్బణం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థి రిపబ్లికన్లకు ప్రచారాస్త్రంగా మారాయి. అమెరికాలో దేశాలు ఉన్నాయా? దేశం గురించి ఆయన మర్చిపోయారని విమర్శలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్టు చేశారు. ‘‘ నిత్యావసర ధరల కంటే వేగంగా వేతనాలు పెరుగుతున్నాయి. అమెరికాలోని యూఎస్లో ఏ దేశంలో లేనంత తక్కువ ద్రవ్యోల్బణం ఉంది. దాన్ని మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని బైడెన్ వ్యాఖ్యానించారు. బుధవారం విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తన ప్రభుత్వ ఆర్ధిక విధానాలను సమర్థించుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో పలువురు నెటిజన్లు బైడెన్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఉత్తర అమెరికా ఖండంలో అని చెప్పబోయి.. అమెరికా అని ఉంటారని ట్వీట్లు చేస్తున్నారు.
వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Biden) జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఇటీవల నివేదిక వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 81 ఏళ్ల వయసున్న బైడెన్కు జ్ఞాపకశక్తి సరిగా లేదని పేర్కొన్నారు. జీవితంలోని కీలక సంఘటనలను సైతం గుర్తుకు తెచ్చుకోలేకపోయారని తెలిపారు. ఈ నివేదికను బైడెన్ తీవ్రంగా ఖండించారు. గత నెలలో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఆయన ఫిట్గా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో మరోసారి ఎన్నికల బరిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పోటీపడేందుకు సిద్ధమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.