Kim Jong Un: అదే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యం!
ఇటీవలి కాలంలో వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా(North Korea) హడలెత్తిస్తోన్న విషయం తెలిసిందే. అయితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉండటమే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) అన్నారు.
ప్యోంగ్యాంగ్: ఇటీవలి కాలంలో వరుస క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా(North Korea) హడలెత్తిస్తోన్న విషయం తెలిసిందే. అయితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉండటమే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) అన్నారు. ఉత్తర కొరియా అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణి పరీక్షలో భాగమైన సైనిక అధికారులను ఆయన తాజాగా అభినందించారు. ఈ సందర్భంగా కిమ్ ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు అధికారిక మీడియా కేసీఎన్ఏ ఆదివారం తెలిపింది. ఈ అధికారిక కార్యక్రమంలో కిమ్ మరోసారి తన కుమార్తెతో కనిపించడం గమనార్హం.
‘దేశంతోపాటు పౌరుల గౌరవం, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకే అణుశక్తిని నిర్మిస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత బలమైన అణ్వాయుధ శక్తిగా నిలవడమే మా దేశ అంతిమ లక్ష్యం’ అని కిమ్ పేర్కొన్నారు. హ్వాసాంగ్-17 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధంగా అభివర్ణించారు. పటిష్ఠమైన సైన్యాన్ని నిర్మించగల ఉత్తర కొరియా సంకల్పం, సామర్థ్యాన్ని ఇది చాటుతుందన్నారు. బాలిస్టిక్ క్షిపణులపై అణు వార్హెడ్లను అమర్చే సాంకేతికత అభివృద్ధిలో ఉత్తర కొరియా శాస్త్రవేత్తలు అద్భుతమైన ముందడుగు వేశారనీ చెప్పారు. ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎనిమిది ఖండాంతర క్షిపణులను పరీక్షించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
ఇరాన్లో కాంట్రాక్ట్పై పని చేసేందుకు వెళ్లిన మత్స్యకారులు తీవ్ర వేధింపులకు గురయ్యారు. దీంతో యజమాని పడవతో సహా వారు పారిపోయి భారత్ చేరుకొన్నారు. ప్రస్తుతం వారు కోస్టుగార్డ్ అదుపులో ఉన్నారు. -
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
ఇజ్రాయెల్-హమాస్ (Israel) మధ్య కాల్పుల విరమణ చర్చలు విఫలమైన నేపథ్యంలో రఫాపై ఐడీఎఫ్ దండయాత్ర మొదలు పెట్టినట్లు స్థానికులు వెల్లడించారు. -
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
అమెరికాలో ఏం చేసినా భారీగా ఉండాల్సిందేనేమో.. అది దుబారా వ్యయమైనా సరే. తాజాగా కొన్ని వందల అడుగుల వంతెనకు ఏకంగా రూ.91 వేల కోట్లు వెచ్చించి కాలిఫోర్నియా విమర్శల పాలవుతోంది. -
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
మూడోసారి అంతరిక్షయానానికి సిద్ధమయ్యారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams). ఈ సందర్భంగా ఆమె తన ఇష్టాలను వెల్లడించారు. -
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
Israel Hamas Conflict: ఇజ్రాయెల్పై వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తమని ఏ దేశమూ నిలువరించలేదని వ్యాఖ్యానించారు. -
టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. 60 మంది మృతి
బ్రెజిల్లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
కీలక క్రాసింగ్పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. -
మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. -
చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది
కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. -
అల్-జజీరాపై నిషేధం
హమాస్కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. -
హమాస్తో తాజా చర్చలు విఫలం?
ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం