Maldives: భారత హెలికాప్టర్, సిబ్బందిపై ఇక పూర్తి నియంత్రణ మాదే: మాల్దీవులు
Maldives: చైనాకు దగ్గరయ్యే క్రమంలో భారత్తో వివాదాలకు తెరతీసిన మాల్దీవులు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి భారత్ ఇచ్చిన హెలికాప్టర్, దాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకోబోతున్నట్లు మాల్దీవుల రక్షణ దళం ప్రకటించింది.
మాలె: క్రమంగా చైనా పంచన చేరుతున్న మాల్దీవులు (Maldives).. భారత వ్యతిరేక వైఖరికి మరింత పదును పెడుతోంది. ఇప్పటికే తమ భూభాగం నుంచి భారత సైనికులను పంపించేయాలని నిర్ణయించగా తాజాగా మరో ముందడుగు వేసింది. భారత్ అందజేసిన హెలికాప్టర్, దాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై పూర్తి నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ‘మాల్దీవుల జాతీయ రక్షణ దళం (MNDF)’ గురువారం ప్రకటించింది.
భారత దళాల ఉపసంహరణపై చర్చలు కొనసాగుతున్నాయని ఎంఎన్డీఎఫ్లోని ‘ప్లాన్స్, పాలసీ, రీసోర్సెస్ విభాగం’ డైరెక్టర్ కర్నల్ అహ్మద్ ముజుథబ మహమ్మద్ తెలిపారు. మే 10 తర్వాత మాల్దీవుల భూభాగంపై విదేశీ దళాలు ఉండొద్దని అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆదేశించినట్లు గుర్తుచేశారు. మరోవైపు మాల్దీవులకు (Maldives) అందజేసిన హెలికాప్టర్ను నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది స్థానంలో సాధారణ పౌర నిపుణుల బృందాన్ని పంపినట్లు భారత్ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
నిరుడు జరిగిన ఎన్నికల్లో చైనా అనుకూల ముయిజ్జు.. భారత్ అనుకూల మహమ్మద్ సోలీని ఓడించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు భారత దళాలు తమ భూభాగం నుంచి వైదొలగాలని అధికారం చేపట్టిన కొన్ని రోజులకే ప్రకటించి వివాదానికి తెరతీశారు. మరోవైపు భారత్తో కుదుర్చుకున్న 100 ఒప్పందాలను సమీక్షిస్తామని ఇటీవల ప్రకటించారు. సముద్రగర్భ సర్వేలు నిర్వహించడానికి గతంలో భారత్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించబోవడం లేదని తెలిపారు.
చైనాకు దగ్గరయ్యే క్రమంలో ఆ దేశంలో వివిధ ఒప్పందాలకు సిద్ధమయ్యారు. బాష్పవాయు గోళాలు, పెప్పర్ స్ప్రే వంటి సాధారణ అస్త్రాలను చైనా ఉచితంగా అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ దేశ సైనికులకు శిక్షణ కూడా ఇస్తుందని స్వయంగా ముయిజ్జు ప్రకటించారు. మరోవైపు రాజధాని మాలె సమీప జలాల్లో చైనా పరిశోధన నౌక వారం రోజులపాటు సంచరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి: మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..!
సౌదీ అరేబియా నిర్మించనున్న కలల నగరం నియోమ్ వెనుక చీకటి కోణం ఉంది. ఈ విషయాన్ని ఆ దేశం నుంచి పారిపోయిన కర్నల్ ఒకరు ఆంగ్లవార్తా సంస్థకు వెల్లడించారు. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
భారత వ్యక్తుల ప్రమేయంతో తమ గడ్డపై గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర జరిగిందని అమెరికా ఆరోపించిన వేళ.. మన దేశానికి రష్యా(Russia) అండగా నిలిచింది. అంతేగాక, భారత ఎన్నికల్లో అగ్రరాజ్యం జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని మాస్కో దుయ్యబట్టింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం
Barron Trump: వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కానున్న బ్యారన్ ట్రంప్ రాజకీయాల్లోకి రానున్నారు. పార్టీ కన్వెన్షన్కు ఆయన ఫ్లోరిడా ప్రతినిధిగా వెళ్లనున్నారు. -
ట్రంప్తో ఏకాంతంగా గడిపా: శృంగారతార స్టార్మీ డేనియల్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. -
ఏప్రిల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలే!
గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. -
బ్రిటన్ విమానాశ్రయాల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు..
బ్రిటన్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు మంగళవారం రాత్రంతా మొరాయించాయి. -
ఇజ్రాయెల్కు అమెరికా షాక్
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. F -
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. -
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వచ్చే వారమే
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. -
ఇండియానా ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇండియానా ప్రైమరీల్లో విజయం సాధించారు. -
రష్యాపై గూఢచర్య ఆరోపణలు.. రాయబార కార్యాలయంలో అధికారిని బహిష్కరించిన బ్రిటన్
రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బ్రిటన్ బుధవారం బహిష్కరించింది. -
ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి
ఉక్రెయిన్పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్కేంద్రాలు, ఇంధన డిపోలు ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. -
లక్ష్మణరేఖ దాటుతున్నారు జాగ్రత్త
కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్లు లక్ష్మణరేఖ (బిగ్ రెడ్లైన్) దాటుతున్నాయని ఆ దేశంలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ హెచ్చరించారు. -
ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో రూ.16 లక్షలు ఉండాల్సిందే
వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. -
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘కన్నప్ప’లో ప్రభాస్.. ఫొటో షేర్ చేసిన మంచు విష్ణు
-
దలాల్ దఢేల్: భారీ నష్టాల్లో సూచీలు.. ₹6 లక్షల కోట్లు ఆవిరి
-
ఎస్బీఐ లాభం ₹21,384 కోట్లు.. పీఎన్బీ లాభం మూడింతలు
-
‘ఆయన కుమారుడిని కానందువల్లే’ - శరద్ పవార్పై అజిత్ విమర్శ
-
ఆర్మూర్లో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాల్కు అధికారుల నోటీసులు
-
మారుతీ సుజుకీ స్విఫ్ట్ మరింత కొత్తగా.. ధర రూ.6.50 లక్షలు