మంగళగిరిలో గెలుపు లోకేశ్దే
గత రెండు ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఓట్లేశాం. ఆయన మా గ్రామానికి చేసిందేమీ లేదు. జగన్ను వ్యతిరేకిస్తూ వైకాపాను వదిలి కాంగ్రెస్లో చేరారు. మళ్లీ ఎందుకు వైకాపాలోకి వెళ్లారు? ఎన్ని గిమ్మిక్కులు చేసినా మంగళగిరిలో ఈసారి లోకేశ్ ఖాయం. మా మద్దతు ఆయనకే.
ఐదేళ్లుగా స్థానికులతో మమేకం
సొంత డబ్బుతో పలు పథకాల్ని అమలుచేసిన యువనేత
నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
వైకాపాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
ఆ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్యకు పరిస్థితులు ప్రతికూలం
గత రెండు ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఓట్లేశాం. ఆయన మా గ్రామానికి చేసిందేమీ లేదు. జగన్ను వ్యతిరేకిస్తూ వైకాపాను వదిలి కాంగ్రెస్లో చేరారు. మళ్లీ ఎందుకు వైకాపాలోకి వెళ్లారు? ఎన్ని గిమ్మిక్కులు చేసినా మంగళగిరిలో ఈసారి లోకేశ్ ఖాయం. మా మద్దతు ఆయనకే.
ఉండవల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకుడి మాట
మా భూములు జగన్ దగ్గర పెట్టాలంట. జిరాక్స్ కాపీలు ఇస్తారంట. సమస్యలు వస్తే ఆయన తీరుస్తారంట. అసలు సమస్యలు సృష్టించేదే ఆయన కదా? మా పాసు పుస్తకాలపై జగన్ బొమ్మలు వేసుకోవడమేంటి?
యర్రబాలెం గ్రామానికి చెందిన ఐదుగురు
వృద్ధుల అభిప్రాయం
ఒక్క ఛాన్స్ అని అడిగితే జగన్కు ఓట్లేశాం. ఏం చేశారు? ఎంతసేపూ చంద్రబాబు గొడవేనా? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదా? ఒక్క రహదారి అయినా బాగుందా? సమస్యలున్నాయని చెప్పేందుకూ స్వేచ్ఛలేదు. ఇదెక్కడి పాలన?
నలుగురు ప్రైవేటు వాహనాల డ్రైవర్లు(మంగళగిరి)
మంగళగిరిలో తెదేపానే గెలుస్తుంది. గత ఎన్నికల్లో వైకాపాకు మద్దతు పలికాం. జగన్ పాలన బాగోలేదు. ఈసారి లోకేశ్కు ఓట్లేయాలని అనుకుంటున్నాం. భాజపాతో తెదేపా పొత్తు అంశాన్ని పట్టించుకునే ముస్లింలు తక్కువే.
మంగళగిరికి చెందిన ఓ ముస్లిం యువకుడు
నేను తెదేపా సానుభూతిపరుడిని. ఒక్క ఛాన్స్ అని అడిగారని గత ఎన్నికల్లో వైకాపాకు ఓటేశా. జగన్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఏమీ చేయలేదు. ఓడిపోయినా నియోజకవర్గ ప్రజలకు లోకేశ్ మేలు చేశారు.
దుగ్గిరాలకు చెందిన ఓ మధ్య వయస్కుడు
జగన్ పనులు ఇవ్వడం మానేసి ఫలహారాలు పంచారు. తిండి తినాలంటే పనులు ఉండాలి కదా? మాకూ పథకాలు అందాయి. కానీ ధరలు ఎంతలా పెరిగాయి?
తాడేపల్లిలో టీస్టాల్ నడుపుతున్న ఓ మహిళ ఆవేదన
ఈనాడు, అమరావతి: మూడున్నర దశాబ్దాల తర్వాత మంగళగిరిలో తెదేపా జెండా ఎగిరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఏ గ్రామానికి వెళ్లినా మెజారిటీ ప్రజల నాడి.. ఇదే వాణిని వినిపిస్తోంది. వైకాపా పాలనలో... రాజధాని తరలింపు నిర్ణయం, అభివృద్ధి మచ్చుకైనా కానరాక పోవడం, వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినడం, ఉపాధి లేకపోవడం... ఇక్కడ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి... జగన్ అధికారంలోకి వచ్చిన జరిగిన విధ్వంసాన్ని ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు. గత ఎన్నికల్లో వైకాపాకు ఓట్లేసిన వారిలో చాలామంది ఇప్పుడు తెదేపాకు మొగ్గుచూపుతున్నారు. వారు బహిరంగంగానే తమ అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఈసారి ఇక్కడ లోకేశ్ తప్పక గెలుస్తారని స్పష్టం చేస్తున్నారు. యువత నుంచి పండుటాకుల వరకు అందరిలోనూ ఈ మార్పు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గంలో సొంత నిధులతో లోకేశ్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువమందిని ఆకట్టుకున్నాయి. సీఎం జగన్ క్యాంపు కార్యాలయంతోపాటు నివాసమూ నియోజకవర్గంలో ఉన్నా... ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజల కష్టాలను పట్టించుకోక పోవడం వైకాపాకు ఎదురుదెబ్బగా మారింది. ఆ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్య రాజకీయాలకు కొత్త. లావణ్య పూర్తిగా కుటుంబసభ్యులపైనే ఆధారపడటం, ఇప్పటికీ ఆమె గురించి ప్రజలకు పెద్దగా తెలియకపోవడం... ప్రతికూలంగా మారింది. మంగళగిరిలో ఈసారి లోకేశ్ గెలుపుపై కంటే... ఆయనకు వచ్చే మెజారిటీపైన పందేలు నడుస్తున్నాయని స్థానికులు చెప్పారు.
వైకాపా అభ్యర్థి ఎంపికే ప్రహసనం
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి తెదేపా నుంచి వైకాపాలో చేర్చుకున్న గంజి చిరంజీవిని నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్ తొలుత ప్రకటించారు. గంజి చిరంజీవి కొద్ది రోజులు ఇంటింటి ప్రచారం నిర్వహించాక ఆయన్ను కాదని మురుగుడు లావణ్యను తెరమీదకు తెచ్చారు. ఈ మార్పులు జరిగేలోపే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైకాపాను వీడి కాంగ్రెస్లో చేరడం... మళ్లీ తిరిగొచ్చి వైకాపా తీర్థం పుచ్చుకోవడం జరిగిపోయాయి. ఈ పరిణామాలతో పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. లావణ్యను ఎంపిక చేయడం పట్ల చిరంజీవి వర్గం గుర్రుగా ఉంది. ఆమెకు ఎంతమేర సహకరిస్తారనేది సందేహమే. రామకృష్ణారెడ్డిని తిరిగి వైకాపాలో చేర్చుకోవడాన్ని మంగళగిరి-తాడేపల్లి నగరం వైసీపీ అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఆయన అంటీముట్టనట్లుగా ఉంటున్నారు.
రచ్చబండ.. అపార్ట్మెంట్లలో సమావేశాలు
యువగళం యాత్రకు ముందే లోకేశ్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ఇంటింటికీ వెళ్లారు. ప్రజల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఊరూరా రచ్చబండ పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. యువతకు ఉపాధి, సంక్షేమ పథకాలు, అమరావతి నిర్మాణం, రాష్ట్ర, నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు... తదితరాలపై అడిగే ప్రశ్నలకు సూటిగా, ధీమాగా సమాధానమిస్తున్నారు. ఇది ఆయనపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచుతోంది. ఇప్పటివరకు 66 రచ్చబండ కార్యక్రమాలు, 12 అపార్ట్మెంట్లలో సమావేశాలు నిర్వహించారు.
అందరినీ కలుపుకొంటూ బ్రాహ్మణి ప్రచారం
మంగళగిరిలో అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొంటూ లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఉత్సాహంగా పర్యటిస్తున్నారు. చేనేతలు, స్వర్ణకారులతో మాటామంతీ నిర్వహించారు. డ్వాక్రా మహిళలు, గార్మెంట్స్, పచ్చళ్ల తయారీ పరిశ్రమల్లో పనిచేసే మహిళలు, పూలతోటల్లో మహిళా కూలీలను కలుస్తున్నారు. అపార్ట్మెంట్లకు వెళ్లి మహిళలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. మహిళామిత్ర సభ్యులతో సమావేశం అవుతున్నారు. క్రీడాకారులతో కలిసి ఆటల్లో పాల్గొంటున్నారు. ఐటీ ఉద్యోగులతో మాట్లాడుతున్నారు. వైకాపా హయాంలో నియోజకవర్గం నష్టపోయిన తీరును వివరిస్తున్నారు.
సంక్షేమ పథకాలే లోకేశ్కు దన్ను
గత ఎన్నికల్లో లోకేశ్ ఓడిపోయినా... నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందున్నారు. సొంత నిధులతో 23 సంక్షేమ పథకాలను అమలు చేశారు. నూతన వధూవరులకు పెళ్లికానుక, అన్న క్యాంటీన్లు, స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఉపాధి శిక్షణ, సంజీవని ఉచిత వైద్యసేవ, యువతకు సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ, జలధార పేరుతో ట్యాంకర్లతో ఉచిత మంచినీరు పంపిణీ, వాటర్ప్లాంట్ల ఏర్పాటు, రజకులకు ఇస్త్రీ బండ్లు, నాయీ బ్రాహ్మణులకు సెలూన్ ఛైర్స్, శ్రామికులకు వెల్డింగ్ మెషిన్లు, చేనేతలకు ప్రత్యేక వీవర్స్ కేంద్రాలు, ఇలా అన్ని వర్గాలు, కులాలకు చెందిన వేల మందికి సహకారం అందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు మట్టి ఖర్చుల కింద నగదును ఇచ్చారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచారు. నియోజకవర్గానికి పరిశ్రమల్ని తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వటంతో ఎక్కువమంది ప్రభావితం అవుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం