మద్యం తాగి కారు నడిపిన మహిళా మంత్రి గారు.. ఆపై రాజీనామా..!
న్యూజిలాండ్ మంత్రి ఒకరు మద్యం తాగి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారు. ఆ తర్వాత పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా ఇబ్బంది పెట్టారు. చివరికి మంత్రి పదవి కోల్పోయారు.
ఇంటర్నెట్డెస్క్: ఆమె ఓ దేశ న్యాయశాఖ మంత్రి. మద్యం తాగి కారు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణం అయ్యారు. అక్కడికి చేరుకొన్న పోలీసులు బ్రీతింగ్ పరీక్ష నిర్వహించగా ఆమె మోతాదుకు మించి మద్యం తాగినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేయబోగా.. తీవ్రంగా ప్రతిఘటించారు. కానీ, పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. విషయం గుప్పుమనడంతో చివరికి పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటన న్యూజిలాండ్లో చోటు చేసుకొంది.
న్యూజిలాండ్ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆమె పదవికి రాజీనామా చేశారు. ఆదివారం రాత్రి మద్యం తాగి కారును అతివేగంగా నడిపారు. దీంతో ఓ పార్కింగ్లోని వాహనాలను ఆమె కారు ఢీకొంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని పరీక్షించగా ఆమె మద్యం తాగినట్లు తేలింది. దీనికి తోడు ఆమె అరెస్టుకు సహకరించలేదు. చివరికి ఆమెను పోలీస్ స్టేషన్కు తరలించి నాలుగు గంటలపాటు ఉంచారు. తాజాగా ఆమె కోర్టులో కేసును ఎదుర్కోవాల్సి ఉంది. ఈ కారణంగా ఆమె సోమవారం పదవికి రాజీనామా చేశారు.
ప్రధాని క్రిస్ హిప్కిన్స్ సోమవారం ఉదయం అలెన్తో మాట్లాడారు. ఆమె మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. మంత్రిగా విధులు నిర్వహించేందుకు తగినంత ఫిట్గా లేరని పేర్కొన్నారు. న్యాయశాఖ మంత్రి క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం సహించరానిదన్నారు. దీంతో అలెన్ రాజీనామా చేయడానికి అంగీకరించారు. పార్లమెంట్ సభ్యురాలిగా మాత్రం ఆమె కొనసాగుతారు.
లేబర్ పార్టీలో 39 ఏళ్ల అలెన్ చాలా వేగంగా ఎదిగారు. కానీ, ఇటీవల కాలంలో ఆమె తన జీవిత భాగస్వామి నుంచి విడిపోయారు. అప్పటి నుంచి ఆమె తీరు మారిపోయింది. తన బృందంలోని ఉద్యోగులతో కూడా ఆమె ప్రవర్తన సరిగా ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. దీనిపై ప్రధాని హిప్కిన్స్ మాట్లాడుతూ.. అలెన్ను చూస్తే బాధగా అనిపించిందని.. ఆమె చాలా ప్రతిభావంతురాలని పేర్కొన్నారు. ఆమె కొన్ని సమస్యలతో పోరాడుతున్నారని చెప్పారు. హిప్కిన్స్ మంత్రి వర్గంలో పదవి కోల్పోయిన నాలుగో మంత్రి ఆమె. అక్టోబర్ 14 తేదీన న్యూజిలాండ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో మంత్రుల వివాదాలు, రాజీనామాలు అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి: మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..!
సౌదీ అరేబియా నిర్మించనున్న కలల నగరం నియోమ్ వెనుక చీకటి కోణం ఉంది. ఈ విషయాన్ని ఆ దేశం నుంచి పారిపోయిన కర్నల్ ఒకరు ఆంగ్లవార్తా సంస్థకు వెల్లడించారు. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
భారత వ్యక్తుల ప్రమేయంతో తమ గడ్డపై గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర జరిగిందని అమెరికా ఆరోపించిన వేళ.. మన దేశానికి రష్యా(Russia) అండగా నిలిచింది. అంతేగాక, భారత ఎన్నికల్లో అగ్రరాజ్యం జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని మాస్కో దుయ్యబట్టింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్న కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం
Barron Trump: వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కానున్న బ్యారన్ ట్రంప్ రాజకీయాల్లోకి రానున్నారు. పార్టీ కన్వెన్షన్కు ఆయన ఫ్లోరిడా ప్రతినిధిగా వెళ్లనున్నారు. -
ట్రంప్తో ఏకాంతంగా గడిపా: శృంగారతార స్టార్మీ డేనియల్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఏకాంతంగా గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్స్ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. -
ఏప్రిల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలే!
గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. -
బ్రిటన్ విమానాశ్రయాల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు..
బ్రిటన్లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు మంగళవారం రాత్రంతా మొరాయించాయి. -
ఇజ్రాయెల్కు అమెరికా షాక్
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతుండటంతో అమెరికా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను తాత్కాలికంగా నిలిపివేసింది. F -
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
చైనా రక్షణ శాఖ మాజీ మంత్రి జనరల్ వే ఫంగ్హా సుదీర్ఘ కాలం తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. -
సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వచ్చే వారమే
బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర వచ్చే వారానికి వాయిదా పడింది. -
ఇండియానా ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇండియానా ప్రైమరీల్లో విజయం సాధించారు. -
రష్యాపై గూఢచర్య ఆరోపణలు.. రాయబార కార్యాలయంలో అధికారిని బహిష్కరించిన బ్రిటన్
రష్యా రాయబార కార్యాలయంలోని రక్షణ వ్యవహారాలు పర్యవేక్షించే అధికారిని గూఢచర్యం ఆరోపణలతో బ్రిటన్ బుధవారం బహిష్కరించింది. -
ఉక్రెయిన్పై రష్యా భారీ దాడి
ఉక్రెయిన్పై బుధవారం రష్యా భారీ దాడులు చేసింది. విద్యుత్కేంద్రాలు, ఇంధన డిపోలు ఇతర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా 50కి పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. -
లక్ష్మణరేఖ దాటుతున్నారు జాగ్రత్త
కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్లు లక్ష్మణరేఖ (బిగ్ రెడ్లైన్) దాటుతున్నాయని ఆ దేశంలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ హెచ్చరించారు. -
ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో రూ.16 లక్షలు ఉండాల్సిందే
వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. -
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
జపాన్లో ఖాళీ ఇళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవి ఆ దేశానికి తలనొప్పిగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ
-
అందుకే భారత్కు సొంత టెక్నాలజీ అవసరం.. లింక్డిన్పై ఓలా సీఈఓ ఫైర్!
-
ఐపీఓకు గో డిజిట్ ఇన్సూరెన్స్.. విరుష్క జోడీ వాటాలు వదులుకుంటున్నారా?
-
హరియాణా సంక్షోభం.. ‘బలపరీక్ష’కు భాజపా మాజీ మిత్రుడి డిమాండ్
-
రివ్యూ: ఆవేశం.. రూ.150 కోట్లు వసూలు చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
-
‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం