North Korea: అబ్బే శతఘ్ని గుండ్లు కాదు.. మేమే శబ్దాలు సృష్టించాం: కిమ్ సోదరి
తాము దక్షిణ కొరియా వైపు అసలు కాల్పులే జరపలేదని.. వాటిని పోలిన శబ్దాలను సృష్టించినట్లు ఉత్తర కొరియా చెబుతోంది. తమ దళాలను కవ్విస్తే ప్రతి స్పందన తీవ్రంగా ఉంటుందని పేర్కొంది.
ఇంటర్నెట్డెస్క్: తమ దేశంపై ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డా.. సైన్యం తక్షణమే తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తుందని ఉత్తర కొరియా(North Korea) అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరించారు. ఈ విషయాన్ని ఆదివారం ఆ దేశ న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ పేర్కొంది. తమ దేశం దిశగా 60 శతఘ్ని గుండ్లను శనివారం ఉ.కొరియా ప్రయోగించినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది. దీనిపై యో జోంగ్ స్పందిస్తూ హెచ్చరికలు జారీ చేశారు.
డెయిఫ్ ఫొటో సాధించాం.. ఉత్తరగాజాలో హమాస్ కమాండ్ వ్యవస్థను ధ్వంసం చేశాం: ఇజ్రాయెల్
‘‘మరోసారి స్పష్టం చేయదల్చుకొన్నాను. మా సైన్యం ట్రిగ్గర్ను ఇప్పటికే అన్లాక్ చేశాం. చిన్న కవ్వింపు చర్య ఎదురైనా వారు తక్షణమే భారీ స్థాయిలో ప్రతిస్పందిస్తారు. మా సైనికులు సముద్రంలోకి ఒక్క షెల్ను కూడా ప్రయోగించలేదు. గన్ఫైర్ను అనుకరించేలా పేలుళ్లను జరిపారు. ఆ తర్వాత మేము ఊహించినట్లే సియోల్ స్పందించింది. శతఘ్ని పేలుళ్లంటూ వారు అబద్ధాన్ని సృష్టించారు. భవిష్యత్తులో ఉత్తర తీరంలో పిడుగులు పడినా.. అది మా సైన్యం పేల్చిన శతఘ్ని గుండు అని చెబుతారు’’ అని యో జోంగ్ వెల్లడించారు.
ఆదివారం కూడా సరిహద్దుల్లో ఉత్తరకొరియా లైవ్ఫైర్ డ్రిల్స్ నిర్వహించింది. ఇవి పశ్చిమ సముద్ర తీరంలో జరిగినట్లు యాంహాప్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించినట్లు తెలిపింది. శుక్రవారం మొదలైన ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శనివారం ఉత్తర కొరియా 200 రౌండ్ల శతఘ్ని గుండ్లను పేలిస్తే.. దక్షిణ కొరియా 400 రౌండ్లతో సమాధానం చెప్పింది. ప్యాంగ్యాంగ్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది. ఉ.కొరియా సరిహద్దుకు సమీపంలోని ద్వీపాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలోజగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం