Viral news: వామ్మో బామ్మ.. డిగ్రీ కోసం 70 ఏళ్లు పట్టింది!
అమెరికాకు చెందిన బామ్మ.. 70 ఏళ్ల క్రితం వదిలేసిన డిగ్రీని తాజాగా పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను నార్తర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ ట్విటర్లో పోస్టు చేయడంతో వైరల్గా మారాయి
ఇంటర్నెట్డెస్క్: అమెరికాకు(America) చెందిన డెఫావ్కు 90 ఏళ్లు. ఇద్దరు భర్తలు. 9 మంది సంతానం, 24 మంది మనవలు, మనవరాళ్లు. మరో 17 మంది మునిమనవలు. 90 పదుల వయస్సులోనూ ఆమెకు చదువుపై శ్రద్ధ తగ్గలేదు. 70 ఏళ్ల క్రితం వదిలేసిన డిగ్రీని తాజాగా ఆమె పూర్తి చేసి ఔరా అనిపించారు. వివరాల్లోకి వెళ్తే.. పెళ్లికి ముందు జాయిస్ వియోలా కనే 1951లో అమెరికాలోని నార్తర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ (NIU)లో బ్యాచ్లర్ ఆఫ్ జనరల్ స్టడీస్ కోర్సులో చేరారు. అప్పుడే డాన్ ఫ్రీమాన్ అనే యువకుడితో ప్రేమలో పడ్డారు. దాదాపు మూడున్నరేళ్లపాటు కళాశాలకు వెళ్లిన ఆమె.. 1955లో అతడిని వివాహమాడారు. దీంతో ఆమె పేరు జాయిస్ డెఫావ్గా మారిపోయింది.
ఆ తర్వాత కుటుంబ బాధ్యతలతో డెఫావ్ చదువుకు స్వస్తి చెప్పారు. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఫ్రీమాన్ మృతి చెందాడు. దీంతో ఆమె మరో వివాహం చేసుకున్నారు. మళ్లీ వారికి ఆరుగురు పిల్లలు. మొత్తం తొమ్మిది మంది పిల్లలు పెద్దవారైన తర్వాత రెండో భర్త కూడా కన్నుమూశారు. వాళ్ల పిల్లలకు పెళ్లిళ్లు కూడా పూర్తయి.. కొందరు మనవళ్లకు కూడా వివాహాలు జరిగిపోయాయి. ప్రస్తుతం 90 ఏళ్ల వయస్సున్న ఆమెకు మళ్లీ చదువుకోవాలనే కోరిక కలిగింది. దీనికి కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. దీంతో 2019లో పాతకాలం నాటి బ్లాక్ అండ్ వైట్ ఐడీ కార్డుతో మళ్లీ కాలేజీలోకి అడుగుపెట్టారు డెఫావ్.
అయితే, ఆమె వయస్సు రీత్యా యూనివర్సిటీ అధికారులు కూడా ఇంటి నుంచి ఆన్లైన్లోనే క్లాసులు వినేందుకు అనుమతించారు. కుటుంబసభ్యులంతా ఆమె ఉంటున్న రిటైర్మెంట్ హోంలో ఓ కంప్యూటర్ను ఏర్పాటు చేసి సహకరించారు. ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన ఆమెకు యూనివర్సిటీ యాజమాన్యం డిసెంబరు 5న డిగ్రీ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా డెఫావ్ మాట్లాడుతూ..‘మన గురించి మనకు తెలియని కొన్ని విషయాలు ఇతరులకు తెలుస్తాయి. నా కుటుంబ సభ్యులంతా నాపై నమ్మకం ఉంచారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు.’’ అని అన్నారు. ఆమె మనవరాళ్లలో ఒకరైన జెన్నా డోలే ఎన్ఐయూ పూర్వ విద్యార్థుల సంఘంలో సభ్యురాలిగా ఉండటం కూడా బామ్మకు కలిసొచ్చింది. ఆమె స్వయంగా యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి డెఫావ్ డిగ్రీ పూర్తి చేసేందుకు సహకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ