Pakistan: ఆ అఫ్గానీయులు వెళ్లిపోవాల్సిందే..! డెడ్లైన్ వేళ పాక్ స్పష్టీకరణ
అక్రమంగా ఉంటున్న అఫ్గానీయులు నవంబరు 1లోపు దేశం విడిచి వెళ్లాల్సిందేనని, గడువు పొడిగించే ప్రసక్తే లేదని పాకిస్థాన్ స్పష్టం చేసింది.
ఇస్లామాబాద్: అనుమతి లేకుండా తమ దేశంలోకి వచ్చిన అఫ్గానీయులు వెంటనే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని పాకిస్థాన్ (Pakistan) ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనే అని ఐరాస (UN) ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ.. ఇస్లామాబాద్ తన నిర్ణయంపై ముందుకెళ్తోంది. గడువు పొడిగింపు (నవంబరు 1) ప్రసక్తే లేదని దేశ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గడువు దాటినా.. ఇంకా ఇక్కడే ఉండేవారిని అరెస్టు చేసి, తరలించేందుకు వీలుగా కేంద్రాలు (Deportation Centers) ఏర్పాటు చేస్తోంది.
స్థానికంగా మూడు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు బలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి జన్ అచక్జాయ్ తెలిపారు. తమ ప్రాంతంలోనూ మూడు కేంద్రాలు ఉంటాయని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ తాత్కాలిక ముఖ్యమంత్రి అజం ఖాన్ చెప్పారు. దేశం విడిచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసినప్పటినుంచి దాదాపు 60 వేల మందికి పైగా అఫ్గాన్లు స్వదేశానికి తిరిగి వెళ్లినట్లు ఆయన చెప్పారు.
మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!
అఫ్గాన్ను 2021లో తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత లక్షలాదిమంది పాకిస్థాన్కు శరణార్థులుగా వచ్చారు. ఐరాస నివేదిక ప్రకారం.. దాదాపు 13 లక్షల మంది అఫ్గాన్ పౌరులు శరణార్థులుగా నమోదు చేసుకున్నారు. మరో 8.8 లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ పొందారు. మరో 17 లక్షల మంది అక్రమంగా తమ దేశంలోకి చొరబడ్డారని మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఇటీవల పేర్కొన్నారు. అక్రమంగా వచ్చినవారంతా నవంబర్ 1నాటికి తమ దేశం విడిచి పోవాలని ఆదేశించారు. లేదంటే భద్రతా బలగాల సాయంతో వారిని గుర్తించి.. బలవంతంగా బహిష్కరిస్తామన్నారు.
మరోవైపు.. అఫ్గానిస్థాన్ ప్రజలపై పాకిస్థాన్ ఉక్కుపాదం మోపడాన్ని ఐరాస ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. దాదాపు 17 లక్షలకుపైగా అఫ్గాన్ శరణార్థులను బలవంతంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను ఆ దేశం చేపట్టడాన్ని తప్పుపట్టింది. ఇది తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొంది. దీంతో కుటుంబాలు వేరు పడతాయని, మైనర్లపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న వేళ పాకిస్థాన్ తన అక్కసును మరోసారి వెల్లగక్కింది. -
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. -
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
Maldives: చైనా పరిశోధక నౌక మరోసారి మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. తిలాఫుషీ తీరంలో ఇది లంగరేసింది. -
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!