Pakistan: రిగ్గింగ్ నిజమే..ఆరోపిస్తూ రాజీనామా చేసిన ఎన్నికల అధికారి
ఇటీవల జరిగిన పాకిస్థాన్(Pakistan) ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, ఎన్నికల అధికారి ఒకరు రాజీనామా చేశారు.
ఇస్లామాబాద్: ఇటీవల జరిగిన పాకిస్థాన్(Pakistan) ఎన్నికల్లో రిగ్గింగ్(poll rigging) జరిగిందని పోలింగ్ ఆఫీసర్ ఒకరు వివరాలు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, చీఫ్ జస్టిస్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. అలాగే ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ అతను రాజీనామా సమర్పించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్(PTI) దేశవ్యాప్త నిరసనలు ప్రారంభించిన తరుణంలో ఈవిషయం వెలుగులోకి రావడం గమనార్హం. రావల్పిండి మాజీ కమిషనర్ లియాఖత్ అలీ చత్తా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులను గెలిచేలా చేశారు. ఈ అవకతవకలకు నేను కూడా బాధ్యత తీసుకుంటున్నాను. ఇందులో ప్రధాన న్యాయమూర్తి, ఎన్నికల సంఘం ప్రధాన అధికారుల ప్రమేయం ఉంది. దేశానికి వెన్నుపోటు పొడిచాను. అది నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. మేం చేసిన అన్యాయానికి మాకు శిక్ష పడాలి. ఆత్మహత్య చేసుకునేంతగా నాపై ఒత్తిడి వచ్చింది. చివరకు ఈ విషయాలన్నీ ప్రజల ముందు ఉంచాలనుకున్నాను. ఈ నాయకుల కోసం ఎలాంటి తప్పులు చేయొద్దని అధికారులను అభ్యర్థిస్తున్నాను’ అంటూ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ ఆరోపణలను పాక్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. కాగా.. పోలింగ్ అనంతరం సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు పలు సందేహాలను రేకెత్తించింది. ఈ క్రమంలోనే లియాఖత్ ఆరోపణలు వచ్చాయి.
ఇదిలాఉంటే.. ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అనువైన వాతావరణం లేకపోవడంతో పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని పీటీఐ(PTI) నిర్ణయించింది. పాక్ జాతీయ అసెంబ్లీలోని 265 స్థానాలకు పీటీఐ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థులు 92 సీట్లు గెల్చుకున్నారు. కానీ, పీఎంఎల్-ఎన్, పీపీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. అనూహ్యంగా మరోసారి షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక