PM Modi: షేక్ హసీనాకు ప్రధాని మోదీ ఫోన్.. చారిత్రక విజయానికి అభినందన
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన షేక్ హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభినందనలు తెలిపారు.
దిల్లీ: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి చారిత్రక విజయం సాధించిన షేక్ హసీనాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ‘ఎక్స్’వేదికగా వెల్లడించారు. ‘‘ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఫోన్ చేసి మాట్లాడాను. పార్లమెంటరీ ఎన్నికల్లో నాలుగోసారి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపాను. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించుకున్న బంగ్లాదేశ్ ప్రజలనూ అభినందించాను. బంగ్లాదేశ్తో శాశ్వత, ప్రజా కేంద్రీకృత భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని మోదీ పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఉదయమే ఢాకాలో షేక్ హసీనాను భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మ కలిసి మన దేశం తరఫున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు, ఎన్నికల్లో విజయం సాధించిన షేక్ హసీనాకు కాంగ్రెస్ పార్టీ అభినందనలు తెలిపింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ తరఫున ఆవామీ లీగ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. భారత్, బంగ్లాదేశ్లు నాగరికత, సంస్కృతిపరంగా, సామాజికంగా, ఆర్థికంగా ముడిపడి ఉన్నాయని.. 1971లో విముక్తి కోసం జరిగిన పోరాటంతో ఇరు దేశాల మధ్య బంధం బలపడిందని గుర్తు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం షేక్ హసీనాకు అభినందనలు తెలిపారు. ‘‘ గెలుపు గెలుపే. షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులు, ఆవామీ లీగ్ పార్టీకి నా అభినందనలు తెలుపుతున్నా. వారు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని పేర్కొన్నారు.
మొత్తం 300 సీట్లకు గాను 299 స్థానాలకు ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ 223 సీట్లు గెలుచుకొని విజయ ఢంకా మోగించింది. అయితే, ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు కొన్ని పార్టీలు ఈ ఎన్నికల్ని బహిష్కరించాయి. జాతీయ పార్టీ అభ్యర్థులకు 11 సీట్లు; మిగతా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, అధికార పార్టీపై తిరుగుబాటు చేసిన అభ్యర్థులు విజయం సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
-
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద