Pakistan: పాకిస్థాన్లో నవాజ్ సంకీర్ణమే.. పొత్తుకు భుట్టో పార్టీ ఓకే..!
రెండురోజుల నుంచి లెక్కింపు ప్రక్రియ జరుగుతున్నప్పటికీ.. పాకిస్థాన్లో ఇప్పటికీ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఈ క్రమంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటు పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ).. అటు పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) (PML) వేటికవే విజయాన్ని ప్రకటించుకున్నాయి. ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దేశంలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువచ్చేందుకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Nawaz Sharif) నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) కలిసి పనిచేయాలని అంగీకారానికి వచ్చాయి. దీనిలో భాగంగా ఇరు పక్షాలకు చెందిన నేతలు శుక్రవారం రాత్రి లాహోర్లో సమావేశమయ్యారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని తెలిపింది.
లండన్ ప్లాన్ విఫలమైంది: ఇమ్రాన్
ఇదిలా ఉండగా.. తమ పార్టీ అగ్రనేత ఇమ్రాన్ ఖాన్ ఏఐ జనరేటెడ్ ప్రసంగాన్ని పీటీఐ పార్టీ విడుదల చేసింది. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించినట్లుగా ఆ వీడియోలో ఉంది. ‘మీ ఓట్ల వల్ల లండన్ ప్లాన్ విఫలమైంది. పాకిస్థానీ ప్రజలు ఆయన్ను (నవాజ్ షరీఫ్ను ఉద్దేశించి) విశ్వసించడం లేదు. మీ ఓటు శక్తిని ప్రతిఒక్కరూ చూశారు. ఇప్పుడు పోలింగ్ ఫలితాన్ని రక్షించుకోవాల్సి ఉంది. భారీగా నమోదైన పోలింగ్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపర్చింది. ఆయన పార్టీ 30 సీట్లలో వెనకబడి ఉన్నప్పటికీ విక్టరీ ప్రసంగం చేసిన తెలివితక్కువ నాయకుడు షరీఫ్’ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
2024లో అమెరికా అధ్యక్ష స్థానంలో మహిళ: నిక్కీ హేలీ
ఎన్నికల నిర్వహణ విజయవంతమైదంటూ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు, ప్రజాస్వామ్యం ప్రజలకు సేవ చేయడానికేనని అన్నారు. ‘స్వప్రయోజనాలకంటే దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 25 కోట్ల మంది ప్రజల కోసం అరాచక పాలనకు దూరంగా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలి’ అని వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్ పార్టీ కూడా కూడా మిత్ర పక్షాలతో చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఇమ్రాన్ బలపరిచిన అభ్యర్థులు 99 సీట్లలో విజయం సాధించారు. పీఎంఎల్-ఎన్ 71, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) 53, ఇతర చిన్న పార్టీలు 27 స్థానాలను దక్కించుకున్నాయి. ఇంకా 15 సీట్లలో ఫలితం వెల్లడికావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఓటింగ్ ముగిసి 40 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన ప్రకటన రాలేదు. దీనిపై అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.