Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్
ఉక్రెయిన్ను అడ్డం పెట్టుకొని పశ్చిమ దేశాలు తమపై నేరుగా యుద్ధం చేస్తున్నాయని రష్యా ఆరోపించింది. ఐరాసలో ప్రసంగించేందుకు వచ్చిన రష్యా మంత్రి సెర్గీ లవ్రోవ్ మాట్లాడుతూ జెలెన్స్కీ ప్రసంగం వినడం కూడా వృథా అని వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్డెస్క్: పశ్చిమ దేశాల శక్తులు ఉక్రెయిన్(Ukraine)కు మద్దతు ఇస్తూ నేరుగా మాస్కోపై యుద్ధంలోకి అడుగుపెట్టాయని రష్యా (Russia) విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్ పేర్కొన్నారు. ఆయన ఐరాస కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు దీనిని ఏమైనా అనుకోండి. వారు నేరుగా మాతో పోరాటం చేస్తున్నారు. మనం దీనిని హైబ్రిడ్ యుద్ధతంత్రం అని అనుకోవచ్చు. కానీ, అది పరిస్థితులను మార్చలేదు. ఉక్రెయిన్ను వాడుకొని పరోక్షంగా యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నవారందరూ కనీసం ఉక్రెయిన్పై దృష్టి పెడితే.. ఆయుధాలను విచ్చలవిడిగా సరఫరా చేసి అమెరికన్లు, బ్రిటిషర్లు, ఇతరులు ఇక్కడ పోరాడుతున్న విషయం అర్థమైపోతుంది’’ అని లవ్రోవ్ వెల్లడించారు.
ఈ క్రమంలో ఉక్రెయిన్ యుద్ధంలో పశ్చిమ దేశాల కిరాయి మూకలు పాల్గొంటున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. పశ్చిమ దేశాలు తమ ప్రజలను ఉక్రెయిన్ వెళ్లొద్దని చెప్పాయి. కానీ, కిరాయి సైనికులు మాత్రం వెళ్లారని వ్యాఖ్యానించారు. ఇక ఐరాసలో జెలెన్స్కీ ప్రసంగాన్ని ఓ టైమ్వేస్ట్ కార్యక్రమంగా లవ్రోవ్ అభివర్ణించారు. ‘‘నేను దాన్ని టీవీలో చూశాను. ఆయన (జెలెన్స్కీ) చాలా క్రూరంగా కనిపించారు. నేను హాజరు కావాల్సిన చాలా కార్యక్రమాలున్నాయి. ఆయనేం చెబుతాడో మనందరికి తెలుసు. అందుకే.. టైమ్ వేస్టు చేసుకోవడం ఎందుకు..?’’ అని రష్యా మంత్రి వ్యాఖ్యానించారు. జెలెన్స్కీ ప్రతిపాదించిన ప్రణాళిక వాస్తవిక పరిస్థితులకు తగినట్లు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరూ ఈ విషయాన్ని తీవ్రంగా దృట్టిపెట్టాల్సిన అంశంగా పరిగణించడంలేదని భావిస్తున్నారే నిర్ణయానికి తాము వచ్చామని లవ్రోవ్ వెల్లడించారు. వారు యుద్ధ క్షేత్రంలోనే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలనుకుంటే.. తాము కాదనమని రష్యా మంత్రి తేల్చిచెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!