Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్
ఉక్రెయిన్ను అడ్డం పెట్టుకొని పశ్చిమ దేశాలు తమపై నేరుగా యుద్ధం చేస్తున్నాయని రష్యా ఆరోపించింది. ఐరాసలో ప్రసంగించేందుకు వచ్చిన రష్యా మంత్రి సెర్గీ లవ్రోవ్ మాట్లాడుతూ జెలెన్స్కీ ప్రసంగం వినడం కూడా వృథా అని వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్డెస్క్: పశ్చిమ దేశాల శక్తులు ఉక్రెయిన్(Ukraine)కు మద్దతు ఇస్తూ నేరుగా మాస్కోపై యుద్ధంలోకి అడుగుపెట్టాయని రష్యా (Russia) విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్ పేర్కొన్నారు. ఆయన ఐరాస కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు దీనిని ఏమైనా అనుకోండి. వారు నేరుగా మాతో పోరాటం చేస్తున్నారు. మనం దీనిని హైబ్రిడ్ యుద్ధతంత్రం అని అనుకోవచ్చు. కానీ, అది పరిస్థితులను మార్చలేదు. ఉక్రెయిన్ను వాడుకొని పరోక్షంగా యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నవారందరూ కనీసం ఉక్రెయిన్పై దృష్టి పెడితే.. ఆయుధాలను విచ్చలవిడిగా సరఫరా చేసి అమెరికన్లు, బ్రిటిషర్లు, ఇతరులు ఇక్కడ పోరాడుతున్న విషయం అర్థమైపోతుంది’’ అని లవ్రోవ్ వెల్లడించారు.
ఈ క్రమంలో ఉక్రెయిన్ యుద్ధంలో పశ్చిమ దేశాల కిరాయి మూకలు పాల్గొంటున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. పశ్చిమ దేశాలు తమ ప్రజలను ఉక్రెయిన్ వెళ్లొద్దని చెప్పాయి. కానీ, కిరాయి సైనికులు మాత్రం వెళ్లారని వ్యాఖ్యానించారు. ఇక ఐరాసలో జెలెన్స్కీ ప్రసంగాన్ని ఓ టైమ్వేస్ట్ కార్యక్రమంగా లవ్రోవ్ అభివర్ణించారు. ‘‘నేను దాన్ని టీవీలో చూశాను. ఆయన (జెలెన్స్కీ) చాలా క్రూరంగా కనిపించారు. నేను హాజరు కావాల్సిన చాలా కార్యక్రమాలున్నాయి. ఆయనేం చెబుతాడో మనందరికి తెలుసు. అందుకే.. టైమ్ వేస్టు చేసుకోవడం ఎందుకు..?’’ అని రష్యా మంత్రి వ్యాఖ్యానించారు. జెలెన్స్కీ ప్రతిపాదించిన ప్రణాళిక వాస్తవిక పరిస్థితులకు తగినట్లు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరూ ఈ విషయాన్ని తీవ్రంగా దృట్టిపెట్టాల్సిన అంశంగా పరిగణించడంలేదని భావిస్తున్నారే నిర్ణయానికి తాము వచ్చామని లవ్రోవ్ వెల్లడించారు. వారు యుద్ధ క్షేత్రంలోనే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలనుకుంటే.. తాము కాదనమని రష్యా మంత్రి తేల్చిచెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హఫీజ్ అనుచరుడు అద్నాన్ అహ్మద్ కాల్చివేత
వరుసగా జరుగుతున్న హత్యలతో పాకిస్థాన్లో ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. -
తొందరగా ఎదిగితే ఆరోగ్యం చిందరవందర!
పదమూడేళ్లకు ముందే రజస్వల అయిన బాలికలు నడి వయసులో టైప్-2 మధుమేహానికి గురయ్యే ముప్పు ఎక్కువని అమెరికన్ పరిశోధకులు కనుగొన్నారు. -
ఓజోన్ కాలుష్యం పెరిగినా అధిక దిగుబడులు
భూ ఉపరితలానికి దగ్గరగా ఓజోన్ కాలుష్యం పెరిగినా దాన్ని తట్టుకునే శక్తి కొన్ని రకాల పంటలకు ఉందని భారత్, అమెరికా, చైనాల్లో 20 ఏళ్లపాటు జరిగిన ప్రయోగాలు నిర్ధారించాయి. -
అప్పుడెందుకు మౌనంగా ఉన్నారు?
హమాస్ ఉగ్ర దాడికి ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ, మహిళా హక్కుల సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
దుబాయ్లో పుతిన్.. యూఏఈ, సౌదీ పాలకులతో భేటీ
ఉక్రెయిన్పై యుద్ధంతో బిజీబిజీగా ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాన్నాళ్ల తర్వాత తొలిసారిగా పశ్చిమాసియా దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్(యూఏఈ)ల్లో బుధవారం పర్యటించారు. -
భారత హజ్, ఉమ్రా యాత్రికులకు వెసులుబాట్లు
భారత్ నుంచి హజ్, ఉమ్రా యాత్రల కోసం మక్కా, మదీనాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం సౌదీ అరేబియా పలు వెసులుబాట్లు కల్పించినట్లు సౌదీ అరేబియా హజ్, ఉమ్రా విభాగ మంత్రి తౌఫిగ్ అల్ రబియా తెలిపారు. -
సూయెజ్ కాలువలో వంతెనను ఢీకొట్టిన రవాణా నౌక
ప్రపంచ వాణిజ్య రవాణాలో అత్యంత కీలకమైన ఈజిప్టులోని సూయెజ్ కాలువలో బుధవారం ఓ నౌక ప్రమాదానికి గురైంది. -
అవును.. కొవిడ్ సమయంలో సరిగా స్పందించలేదు
కొవిడ్ వైరస్ తీవ్రతను తమ ప్రభుత్వం తక్కువ అంచనా వేసిందని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. -
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో: బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో బుధవారం అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
రోదసిలోకి జంతువులను మోసుకెళ్లే క్యాప్సూల్ను ప్రయోగించాం
సమీప భవిష్యత్తులో మానవసహిత అంతరిక్ష యాత్రలు చేపట్టే దిశగా తాము కీలక ముందడుగు వేసినట్లు ఇరాన్ తెలిపింది. -
శిలాజ ఇంధనాలకు స్వస్తి చెబుదాం
ఐక్యరాజ్య సమితి కాప్-28 సదస్సులో వాతావరణ చర్చలపై తొలి రోజు గణనీయమైన పురోగతి కనిపించినా ఆ తరువాత పరిస్థితి ముందుకూ వెనక్కూ అన్నట్లు ఊగిసలాడుతోంది. -
భీకర భూతల పోరు
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ దళాల మధ్య భీకర భూతల పోరు సాగుతోంది. ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు ఈ పోరు విస్తరించడంతో ప్రజలు భీతావహులై పోతున్నారు. -
కిమ్ కంటతడి!
ఉత్తర కొరియా అధినేత కిమ్జోంగ్ ఉన్ పేరు వినగానే ఆయన నియంతృత్వ వైఖరే గుర్తొస్తుంది. -
ఆస్ట్రేలియా రోడ్డు ప్రమాదంలో భారతీయుడి మృతి
ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖుస్దీప్ సింగ్ అనే భారతీయుడు దుర్మరణం పాలయ్యారు.


తాజా వార్తలు (Latest News)
-
భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు
-
నిజామాబాద్ బబ్లూను.. నిన్ను లేపేస్తా: డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిన మందుబాబు వీరంగం
-
Chicken Price: చికెన్ అగ్గువ.. గుడ్డు పిరం
-
Hyderabad: రేవంత్ ప్రమాణస్వీకారం.. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
-
రైల్వేజోన్కు ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్