Ukraine: కీవ్పై క్షిపణుల వర్షం.. రష్యా ఇరానియన్ డ్రోన్లు వాడింది: జెలెన్స్కీ
తమ దేశాన్ని భూమి నుంచి తుడిచిపెట్టేయాలని రష్యా చూస్తోందని వ్యాఖ్యానించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఈ దాడుల్లో రష్యా ఇరాన్కి చెందిన డ్రోన్లు ఉపయోగించిందని వెల్లడించారు.
కీవ్: ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్పై పుతిన్ సేనలు మరోసారి విరుచుకుపడ్డాయి. ప్రతీకారంతో ఈ ఉదయం క్షిపణుల వర్షం కురిపించాయి. రష్యా-క్రిమియాలను కలిపే కెర్చ్ వంతెన కూల్చివేతలో ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ విభాగం హస్తముందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించిన మరుసటిరోజే ఈ దాడులు ఆరంభం కావడం గమనార్హం. ఆ ఘటనకు ప్రతీకారంగానే కీవ్ సహా పలు నగరాలపై రష్యా సైన్యం దాదాపు 75 క్షిపణులు ప్రయోగించగా.. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడినట్టు ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇంకోవైపు, జూన్ 26 తర్వాత కీవ్ నగరంపై ఉక్రెయిన్ దాడులకు దిగడం ఇదే తొలిసారి. తమ దేశాన్ని భూమి నుంచి తుడిచిపెట్టేయాలని రష్యా చూస్తోందని వ్యాఖ్యానించిన జెలెన్స్కీ.. ఈ దాడుల్లో రష్యా ఇరాన్కి చెందిన డ్రోన్లు ఉపయోగించిందని వెల్లడించారు. తమ దేశంలోని ఇంధన మౌలిక వసతులు, దేశ ప్రజలను రష్యా టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు.
కీవ్లో విధ్వంసం
కీవ్ నగరంతో పాటు ఉక్రెయిన్లోని దక్షిణ, పశ్చిమ నగరాలను టార్గెట్గా చేసుకొని రష్కా సేనలు దాడులు చేసినట్టు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. యుద్ధం ప్రారంభంలో కీవ్ను ఆక్రమించుకొనేందుకు జరిపిన దాడుల తర్వాత ఇంత ఉద్దృతంగా క్షిపణులు ప్రయోగించడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్పై దాడులు జరపడం ద్వారా ఇప్పటికే భారీ నష్టాన్ని కలిగించిన రష్యా.. ఆ దేశంలోని ఇంధనమౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంది. తాజా దాడుల నేపథ్యంలో కీవ్లో అత్యంత రద్దీగా ఉండే రోడ్డు కూడళ్లలో రోడ్లు ధ్వంసమయ్యాయి. అలాగే, భవంతులతో పాటు, కార్లు దెబ్బతిన్నాయి. దీంతో ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
రష్యా రాయబారిని వివరణ కోరాం: మోల్డోవా
ఉక్రెయిన్ను లక్ష్యంగా చేసుకొని రష్యా ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులు తమ గగనతలాన్ని దాటి వెళ్లాయని మోల్డోవా తెలిపింది. దీనిపై మాస్కో రాయబారిని వివరణ అడిగినట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి నికు పొపెస్కో ట్విటర్లో వెల్లడించారు. నల్ల సముద్రం నుంచి రష్యా నౌకల నుంచి ఈ ఉదయం మూడు క్రూయిజ్ క్షిపణులు మోల్డోవా గగనతలం మీదుగా దూసుకెళ్లాయని పేర్కొన్నారు. క్రిమియా- రష్యాను కలిపే వంతెనను పేల్చివేతకు గురికావడంపై ఉక్రెయిన్ను పుతిన్ నిందించిన మరుసటి రోజే ఈ దాడులు చోటుచేసుకున్నాయి. ఈ వంతెన పేలుడు ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. దీన్ని పుతిన్ ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
62వేల మందికి పైగా రష్యా సైనికుల మృతి!
మరోవైపు, రష్యా సేనల్ని ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొంటోంది. ఆ దేశాన్ని సైనికపరంగా దెబ్బతీస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి అక్టోబర్ 10 వరకు రష్యాకు చేసిన నష్టం వివరాలను ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తంగా 62,870మంది రష్యా సైనికులు హతమైనట్టు ట్విటర్లో పేర్కొంది. అలాగే, శత్రుదేశానికి చెందిన 2495 యుద్ధ ట్యాంకులు, 5149 సాయుధ వాహనాలు, 267 మిలటరీ జెట్లు, 235 హెలికాప్టర్లు, 1097 డ్రోన్లు, 249 క్రూయిజ్ క్షిపణులు, 15 బోట్లు, 3908 వాహనాలు, ఇంధన ట్యాంకులు, 136 ప్రత్యేక పరికరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?