21న భారత్‌కు శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే

శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే ఈ నెల 21 నుంచి రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు.

Published : 09 Jul 2023 23:14 IST

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే ఈ నెల 21 నుంచి రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. గతేడాది జులైలో జరిగిన ప్రజా తిరుగుబాటు అనంతరం అప్పటి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే పదవీ నుంచి తప్పుకున్న అనంతరం విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారిగా ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. విద్యుత్తు, ఇంధనం, వ్యవసాయం, నౌకాయానం తదితర అంశాలపై చర్చలు జరుపుతారు. అధ్యక్షుడితో పాటు శ్రీలంక మత్స్యశాఖ మంత్రి డగ్లస్‌ దేవానంద, విద్యుత్తు, ఇంధన శాఖ మంత్రి విజేశేఖర్‌, విదేశాంగ మంత్రి అలీ సబ్రీలు భారత్‌లో పర్యటిస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని