Eiffel Tower: తప్పతాగి ఈఫిల్ టవర్ పైకెక్కి.. ఇద్దరు అమెరికా టూరిస్టుల నిర్వాకం
పూటుగా తాగిన ఇద్దరు అమెరికా పర్యాటకులు సెక్యూరిటీ సిబ్బందిని ఏమార్చి ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ఎత్తైన ప్రాంతానికి చేరుకొని ఒక రాత్రంతా గడిపారు. ఉదయం గస్తీలో భాగంగా టవర్పైకి చేరుకొని భద్రతా సిబ్బందికి వీరు తారపడ్డారు.
ప్యారిస్: పూటుగా మద్యం తాగిన ఇద్దరు అమెరికా టూరిస్టులు ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్లో అత్యంత ఎత్తైన అనుమతి లేని ప్రదేశానికి చేరుకొని ఒక రాత్రంతా నిద్రపోయారు. ఉదయాన్నే భద్రతా సిబ్బంది గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులు ఆగస్టు 13న రాత్రి 10.40 గంటలకు టికెట్లు కొని టవర్పైకి ఎక్కారు. టవర్ మూసివేత సమయం అవడంతో భద్రతా సిబ్బంది పర్యటకులను కిందికి దింపివేశారు. అయితే వీరు సెక్యూరిటీ సిబ్బందిని ఏమార్చి పర్యాటకులకు అనుమతి లేని టవర్ ఎత్తైన రెండు మూడు లెవెల్స్ మధ్య ప్రాంతానికి చేరుకొన్నారు. మద్యం మత్తు కారణంగా కిందికి రాలేక అక్కడే రాత్రంతా పడుకున్నారు.
స్టన్నింగ్ చిత్రంతో ఐఎస్ఎస్ నుంచి భారతీయులకు శుభాకాంక్షలు చెప్పిన యూఏఈ ఆస్ట్రోనాట్
పర్యాటకుల కోసం ప్రతి రోజు టవర్ను ఉదయం 9 గంటలకు తెరుస్తారు. అంతకు ముందే భద్రతా సిబ్బంది టవర్ గస్తీ చేపడతారు. ఈ క్రమంలో అనుమతిలేని ప్రాంతంలో వీరు పడుకున్న దృశ్యాన్ని భద్రతా సిబ్బంది గమనించి ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో వెంటనే పైఅధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఫైర్పైటర్లు, రెస్క్యూ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. ఎత్తైన ప్రాంతం నుంచి వారిని జాగ్రత్తగా కిందికి దించినట్లు ఈఫిల్ టవర్ ఆపరేట్ సంస్థ సెటె పేర్కొంది. అనంతరం వీరిని ప్యారిస్ పోలీస్ స్టేషన్కు తరలించారు. క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ తతంగంతో సోమవారం ఉదయం గంటపాటు ఆలస్యంగా పర్యాటకులను టవర్పైకి అనుమతిచ్చారు.
ఈఫిల్ టవర్ను కూల్చివేసేందుకు బాంబు అమర్చామంటూ ఈ ఘటన జరగడానికి ఒక్కరోజు ముందు ఓ దుండగుడు బెదిరింపు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది టవర్, పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సందర్శకులను అక్కడి నుంచి బయటకు పంపి బాంబు నిర్వీర్య బృందాలతో జల్లెడ పట్టారు. 330 మీటర్లు ఉన్న ఎత్తైన ఈ ప్రపంచ ప్రఖ్యాత కట్టడాన్ని 1887లో చేపట్టారు. 1889లో మార్చి 31న పూర్తయింది. ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు ఈఫిల్ టవర్ను సందర్శస్తారు. గతేడాది 62 లక్షలకు పైగా పర్యాటకులు వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
-
వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా