రష్యాతో చర్చలకు సిద్ధం.. ఉక్రెయిన్ ప్రకటన
రష్యాతో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు.
కీవ్: రష్యాతో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ముందుగా చెప్పినట్లు బెలారస్ వేదికగా కాకుండా సరిహద్దు ప్రాంతంలో పరస్పరం చర్చించేందుకు అంగీకరించారు. ఈ విషయంపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ఫోన్లో మాట్లాడిన ఆయన.. చర్చలకు ఒప్పుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్ష భవనం వెల్లడించింది. చర్చలకు రాకుండా ఉక్రెయిన్ నాయకత్వం సమయం వృథా చేస్తోందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ నుంచి ఈ ప్రకటన వెలువడం గమనార్హం.
‘ఉక్రెయిన్-బెలారస్ సరిహద్దు ప్రాంతమైన ప్రిప్యాట్ నది సమీపంలో ఇరుదేశాల ప్రతినిధుల బృందాలు చర్చలు జరుపనున్నాయి. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండానే చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. అయితే, చర్చలకు బయలుదేరే సమయం మొదలు, చర్చలు జరిగే సమయం, తిరిగి వచ్చే వరకూ బెలారస్లోని అన్ని రకాల విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణలు ఎగరకుండా చూసే బాధ్యతను బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో తీసుకున్నారు’ అని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. దీంతో ఇరుదేశాల మధ్య శాంతి చర్చలకు తొలి అడుగు పడినట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక రష్యా చేపట్టిన సైనిక చర్యపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తుండడంతో ఉక్రెయిన్తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా వెల్లడించింది. ఇందుకు బెలారస్లోని గోమెల్లో చర్చిద్దామని ఉక్రెయిన్కు తెలిపింది. అయితే, రష్యా చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరస్కరించారు. బెలారస్లోని పలు ప్రాంతాల నుంచే తమ దేశంపై రష్యా క్షిపణి దాడులకు పాల్పడుతుందన్న ఆయన.. తమపై దాడి చేయని దేశాల్లో మాత్రమే చర్చిస్తామని స్పష్టం చేశారు. తాజాగా మరోసారి తమ నిర్ణయాన్ని సమీక్షించుకున్న ఉక్రెయిన్.. చివరకు బెలారస్ సరిహద్దు ప్రాంతంలో చర్చించేందుకు అంగీకరించింది.
ఇదిలాఉంటే, తమ దేశంపై దాడుల నేపథ్యంలో రష్యాను ఐరాస భద్రతామండలి నుంచి తొలగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్పై జరుగుతోన్న సైనిక చర్య ‘మారణహోమం’తో సమానమన్నారు. రష్యా తప్పుడు మార్గంలో వెళ్తున్నందున యూఎన్ఎస్సీలో దాని స్థానాన్ని తొలగించాలన్నారు. ఉక్రెనియాపై దాడులను అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రిబ్యునల్ ద్వారా దర్యాప్తు చేయించాలని, వాటిని ఉగ్రవాద చర్యలుగా పరిగణించాలని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా సైనిక చర్యను వెంటనే ఆపివేసేలా రష్యాను ఆదేశించాలని కోరుతూ అంతర్జాతీయ న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
Israel Hamas Conflict: ఇజ్రాయెల్పై వస్తున్న విమర్శలను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తమని ఏ దేశమూ నిలువరించలేదని వ్యాఖ్యానించారు. -
టెక్సాస్ను ముంచెత్తుతున్న వరదలు
భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
బ్రెజిల్లో వరద బీభత్సం.. 60 మంది మృతి
బ్రెజిల్లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆదివారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. -
శ్వేతసౌధం ప్రహరీ గేటును ఢీకొన్న కారు: డ్రైవర్ దుర్మరణం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం ప్రహరీ గేటును కారు ఢీకొట్టిందని, ఈ ఘటనలో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడని అధికారులు తెలిపారు. -
కీలక క్రాసింగ్పై హమాస్ దాడి
గాజాలోకి మానవతా సాయం పంపడానికి వినియోగిస్తున్న కెరోమ్ షాలోమ్ క్రాసింగ్పై ఆదివారం హమాస్ రాకెట్లతో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోనూ విడుదల చేసింది. -
మాదక ద్రవ్యాలు ఇచ్చి నాపై లైంగిక దాడి చేశారు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ ఎంపీ బ్రిటానీ లాగా(37)కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. రాత్రి వేళ సరదాగా గడపడానికి వెళ్లిన ఆమెకు కొంతమంది దుండగులు మాదకద్రవ్యాలు అందించారు. -
చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది
కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. -
అల్-జజీరాపై నిషేధం
హమాస్కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్పై ఆదివారం ఇజ్రాయెల్ నిషేధం విధించింది. -
హమాస్తో తాజా చర్చలు విఫలం?
ఇజ్రాయెల్తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్ ఆదివారం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?