Austin: రక్షణమంత్రి అనారోగ్యం గురించి బైడెన్కు తెలియదు..అనుమానాలకు తావిస్తున్న గోప్యత
అమెరికా రక్షణమంత్రి అనారోగ్యంపై పెంటగాన్ పాటిస్తోన్న గోప్యత పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయనకు క్యాన్సర్ సర్జరీ జరిగిందని నిన్నటివరకు అధ్యక్షుడు బైడెన్(Joe Biden)కు కూడా తెలియకపోవడం గమనార్హం.
వాషింగ్టన్: అమెరికా(USA) రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ (Lloyd Austin) కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడగా, గతనెలలో సర్జరీ జరిగింది. ఆయన అనారోగ్యం గురించి నిన్నటివరకు(మంగళవారం) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Jeo Biden)కు తెలియకపోవడం గమనార్హం. తాము సమాచారం ఇవ్వలేదని రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్ అంగీకరించింది.
70 ఏళ్ల ఆస్టిన్(Austin) జనవరి ఒకటిన వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో చేరారు. అయితే ఆసుపత్రిలో చేరిక విషయాన్ని పెంటగాన్ గోప్యంగా ఉంచింది. గతవారం వరకు వైట్హౌస్, కాంగ్రెస్కు దీనిపై సమాచారం లేదు. ‘ఆస్టిన్ ఆసుపత్రిలో చేరికపై గత గురువారం వరకు బైడెన్కు సమాచారం లేదు. ఆసుపత్రిలో చేరడానికి కారణం ప్రొస్టేట్ క్యాన్సర్ అని ఈ మంగళవారం వరకు అధ్యక్షుడికి తెలియదు’ అని వైట్హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. వైట్హౌస్లో ఎవరికీ కూడా దీని గురించి తెలియదన్నారు. శనివారం ఆస్టిన్, బైడెన్ మాట్లాడుకున్నారు. కానీ నిన్నటివరకు రక్షణ మంత్రి అనారోగ్యం గురించి బైడెన్కు తెలియకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నిరోజులపాటు రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి కాథ్లీన్ హిక్స్ వద్ద కూడా ఈ గోప్యత పాటించడం.. రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.
‘ఉక్రెయిన్, గాజాలో యుద్ధాలు జరుగుతోన్న తరుణంలో మీ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది అధ్యక్షుడు, చివరకు మీ డిప్యూటీకి కూడా సమాచారం ఇవ్వకపోవడం.. ఆమోదయోగ్యం కాదు’ అని ఆస్టిన్ను రిపబ్లికన్ పార్టీ తప్పుపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
-
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
-
డబ్బన్నావ్.. డబ్బాకొట్టుకున్నావ్!!