USA: మేం మరో యుద్ధం కోరుకోవడం లేదు: అమెరికా
USA: జోర్డాన్లో జరిగిన దాడికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. అయితే, తాము మరో యుద్ధం మాత్రం కోరుకోవడం లేదని స్పష్టం చేసింది.
వాషింగ్టన్: పశ్చిమాసియాలో తాము మరో యుద్ధం కోరుకోవడం లేదని.. ఉద్రిక్తతలను పెంచాలన్నదీ తమ ఉద్దేశం కాదని అమెరికా (USA) స్పష్టం చేసింది. అయితే, తమని తాము రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని సోమవారం తేల్చి చెప్పింది. జోర్డాన్లో (Jordan) అమెరికా స్థావరంపై ఆదివారం జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు సైనికులు మరణించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.
జోర్డాన్లో (Jordan) జరిగిన దాడిలో మరో 30 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారని శ్వేతసౌధం జాతీయ భద్రతా మండలిలోని స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ సమన్వయకర్త జాన్ కిర్బీ వెల్లడించారు. ఐసిస్ ఉగ్రముప్పును ఎదుర్కోవటంలో భాగంగా భాగస్వామ్య దేశాలతో కలిసి ఆ ప్రాంతంలో అమెరికా (USA) సైనికులు కీలక మిషన్ చేపట్టారని పేర్కొన్నారు. అది ఇకపైనా కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీనితో ఇజ్రాయెల్ వివాదానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తాజా దాడికి సంబంధించి అమెరికా రక్షణ శాఖ మరింత లోతైన సమాచారాన్ని సేకరిస్తోందని వెల్లడించారు.
Tower 22: ఏమిటీ స్థావరం? అమెరికాకు ఎందుకంత కీలకం?
అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా సిబ్బందితో ఇప్పటికే రెండు సార్లు సమావేశమయ్యారని కిర్బీ తెలిపారు. జోర్డాన్లో జరిగిన దాడిపై ఎలా ప్రతిస్పందించాలో సమాలోచనలు జరిపారని వివరించారు. ఇరాన్ మద్దతున్న సంస్థలే ఈ దాడులకు పాల్పడ్డాయని ఆరోపించిన ఆయన.. అందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు సేకరించి ఎదురుదాడి చేస్తామని తెలిపారు. మరో సమావేశంలో విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
జోర్డాన్లోని (Jordan) అమెరికా సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు సైనికులు మరణించిన విషయం తెలిసిందే. తామే ఈ దాడికి పాల్పడ్డట్లు ఇరాక్ కేంద్రంగా పనిచేసే ముజాహిదీన్ ఆఫ్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూపు ప్రకటించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలయ్యాక పశ్చిమాసియాలో అమెరికా సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారి. తమ స్థావరంపై దాడి ఇరాన్ మద్దతిచ్చే మిలిటరీ గ్రూపు పనేనని ఆదివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
WWE మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన కోహ్లీ, జాక్స్.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!