Tower 22: ఏమిటీ స్థావరం..? అమెరికాకు ఎందుకంత కీలకం..?
జోర్డాన్ ఈశాన్య ప్రాంతంలో తమ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు డ్రోన్ దాడులు జరపడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించింది.
ఇంటర్నెట్ డెస్క్: జోర్డాన్లో ఉన్న సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడితో (Drone Attack) అమెరికా ఉలిక్కిపడింది. ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోవడంతోపాటు పదుల సంఖ్యలో గాయపడిన ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఈ దాడితో ఇరాన్కు సంబంధముందనే అనుమానం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం.. సరైన సమయంలో దీటుగా బదులిస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జోర్డాన్లోని అత్యంత కీలకమైన ఆ ప్రదేశం ఏంటనే విషయాన్ని పరిశీలిస్తే..
మూడు దేశాల సరిహద్దు..
జోర్డాన్ ఈశాన్య ప్రాంతంలో అమెరికాకు ఉన్న సైనిక స్థావరాన్నే టవర్ 22గా (Tower 22) పేర్కొంటారు. సిరియా, ఇరాక్, జోర్డాన్.. మూడు దేశాల సరిహద్దులు కలిసే చోటు ఇది. అగ్రరాజ్యానికి వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ప్రదేశం. ఇస్లామిక్ స్టేట్పై (ISIS)పోరుకు ఇదెంతో కీలకం. సిరియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరమైన అల్-టాన్ఫ్కు అతికొద్ది దూరంలో ఉండటం కలిసివచ్చే అంశం. ఇరాన్ బలగాలను ఎదుర్కొనేందుకు అనువైన వ్యూహాత్మక ప్రదేశంగా అగ్రరాజ్యం దీన్ని భావిస్తోంది. దాదాపు 350 మంది యూఎస్ సైనికులు, వైమానిక సిబ్బంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంజినీరింగ్, ఏవియేషన్, లాజిస్టిక్, సెక్యూరిటీ విభాగాలకు చెందిన సిబ్బంది ఉన్నారు.
తన్నుకున్న ఎంపీలు.. ముష్టిఘాతాలతో దద్దరిల్లిన మాల్దీవుల పార్లమెంటు
ఐదు దేశాల సరిహద్దులున్న జోర్డాన్లో దాదాపు 3వేల మంది అమెరికా సైన్యం ఉన్నట్లు అంచనా. స్థానిక బలగాలతో కలిసి ఏడాది పాటు ఇక్కడ సైనిక విన్యాసాలు కొనసాగిస్తూనే ఉంటుంది. సిరియా, ఇరాక్ నుంచి మిలిటెంట్లు చొరబడకుండా అడ్డుకునే నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు లక్షల డాలర్లను అమెరికా ఖర్చు చేసినట్లు సమాచారం. ఇలా అనేక విధాలుగా కీలకమైన స్థావరం కావడంతో మిలిటెంట్లు దీన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
150 సార్లు దాడులు..
ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు కలిగిన మిలిటెంట్ బృందాలు ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నట్లు పెంటగాన్ అనుమానిస్తోంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైన తర్వాత అమెరికా స్థావరంపై డ్రోన్ దాడి జరగడం.. మధ్యప్రాచ్యంలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చింది. అక్టోబర్ నుంచి ఇప్పటివరకు దాదాపు 150సార్లు తమ స్థావరాలపై దాడులు జరిగినట్టు అమెరికా రక్షణ విభాగం పేర్కొంది. డ్రోన్లు, రాకెట్లు, క్షిపణులతో దాడులు జరిగాయని ఆరోపించింది. వీటికి తమదే బాధ్యత అని ఇరాక్ కేంద్రంగా పనిచేసే ముజాహిదీన్ ఆఫ్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూపు ప్రకటించింది. అయితే, అమెరికా హెచ్చరికల నేపథ్యంలో కొన్ని మిలిటెంట్ బృందాలు సరిహద్దు నుంచి దూరంగా వెళ్లిపోతున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM