Isarel: హమాస్ అంతుచూడకపోతే వాళ్లు మళ్లీ వస్తారు: నెతన్యాహు
హమాస్ మిలిటెంట్లను అంతమొందించకపోతే.. వాళ్లు మళ్లీ వస్తారని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. సోమవారం ఆయన హమాస్తో యుద్ధంలో పాల్గొంటున్న సైనికులను నేరుగా కలుసుకొని మాట్లాడారు.
టెల్ అవీవ్: హమాస్ (Hamas)ను అంతమొందించే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ (Israel) ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) మరోసారి స్పష్టం చేశారు. యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకు వద్దకు నెతన్యాహు తరచూ వెళ్లి వారిలో స్ఫూర్తిని రగిలిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఆయన.. క్యారకాల్ బెటాలియన్ సైనికులతో మాట్లాడారు. ఈ యుద్ధం హమాస్ మిలిటెంట్ల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనే నిరంతర పోరాటమని చెప్పారు. ఇది ఆర్మీ చేపట్టే సాధారణ ఆపరేషన్ కాదని, హమాస్ను తుదిముట్టించే వరకు కొనసాగే యుద్ధమని తెలిపారు. సైనికులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమన్నారు. ఇది మాటలతో అయ్యే పనికాదని, హమాస్ మిలిటెంట్లను అంతం చేయకపోతే.. వాళ్లు మళ్లీ వస్తారని చెప్పారు.
అల్-షిఫా ఆసుపత్రి చుట్టూ పోరు
నెతన్యాహు ఆదేశాల మేరకు ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం హమాస్ స్థావరాలున్న గాజాను పూర్తిగా చుట్టుముట్టి దాడులు చేస్తోంది. అల్-ఖుద్స్ ఆస్పత్రిలో పౌరుల మధ్యలో నక్కిన హమాస్కు చెందిన ఓ గ్రూప్ను లక్ష్యంగా చేసుకొని సోమవారం దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఆస్పత్రి ఆవరణ నుంచి మిలిటెంట్లు కాల్పులు జరిపారని, వారిపై తాము జరిపిన కాల్పుల్లో 21 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు వెల్లడించింది.
మరోవైపు ఇజ్రాయెల్తో జరుగుతోన్న యుద్ధంలో ఇప్పటి వరకు తమవైపు 11,240 మంది మృతి చెందారని గాజాలోని హమాస్ ప్రభుత్వం తెలిపింది. మృతుల్లో 4,630 మంది చిన్నారులు, 3,130 మంది మహిళలు ఉన్నారని, మరో 29వేల మంది గాయపడ్డారని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. -
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
Elon Musk: గ్రహాంతర జీవులు ఉన్నారా అనే అంశంపై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలోజగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం