Rishi Sunak: ‘హిందువు’గా గర్విస్తున్నా.. ‘ఖలిస్థానీ’ పేరుతో హింసను సహించను!
హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని.. ఖలిస్థానీ తీవ్రవాదం అంశాన్ని అధిగమించేందుకు భారత్తో కలిసి బ్రిటన్ పనిచేస్తోందని ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak) పేర్కొన్నారు.
దిల్లీ: ఖలిస్థానీ తీవ్రవాదం అంశాన్ని అధిగమించేందుకు భారత్తో కలిసి బ్రిటన్ పనిచేస్తోందని ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak) పేర్కొన్నారు. హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్న ఆయన.. ఈ ముప్పుకు ముగింపు పలికేందుకు రెండు దేశాలు సహకరించుకుంటున్నాయన్నారు. జీ20 సదస్సులో (G20 Summit) పాల్గొనేందుకు భారత్ చేరుకున్న ఆయన.. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖలిస్థానీతోపాటు భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం, హిందుత్వ, తదితర అంశాలపై మాట్లాడారు.
‘తీవ్రవాదం, హింస వంటివి ఏ రూపంలో ఉన్న వాటికి బ్రిటన్లో తావులేదు. అందుకే ఖలిస్థానీ (Khalistan) మద్దతుదారుల అంశాన్ని అధిగమించేందుకు భారత్తో కలిసి పనిచేస్తున్నాం. ఇటీవల బ్రిటన్ భద్రతా మంత్రి భారత్లో పర్యటించారు. కీలక సమాచారాన్ని పంచుకుంటూ.. ఈ తరహా హింసను అంతం చేసేందుకు రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. హింసాత్మక చర్యలు సరైనవి కావు. బ్రిటన్లో దాన్ని నేను సహించను’ అని ఖలిస్థానీ మద్దతుదారుల హింసపై రిషి సునాక్ ఘాటుగా స్పందించారు.
హిందువుగా గర్విస్తున్నా..
‘హిందువుగా నేను గర్విస్తున్నా. నేను అలాగే పెరిగాను. అలాగే ఉన్నాను. ఆలయాలకు వెళ్తాను. ఇటీవలే రక్షాబంధన్ చేసుకున్నాం. భారత్కు రావడం వ్యక్తిగతంగా నాకెంతో ప్రత్యేకమైన విషయం. నా కుటుంబీకులకు చెందిన భారత్ అంటే నాకు అమితమైన ప్రేమ. యూకే ప్రధాని బాధ్యతల్లో ఇక్కడకు వచ్చాను. భారత్తో సన్నిహిత సంబంధాలను ఏర్పచుకునే మార్గాలు కనుగొనడం, ఇక్కడ నిర్వహిస్తోన్న జీ20 సదస్సును విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది’ అని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన దేశం జీ20 సదస్సు నిర్వహిస్తోందంటూ భారత్ను ప్రశంసించారు.
భారత అల్లుణ్ని.. ఈ పర్యటన ఎప్పుడూ ప్రత్యేకమే: రిషి సునాక్
ఇదిలాఉంటే, లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలిస్థానీ వాదులు ఈ ఏడాది మార్చిలో దాడిచేయడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఖలిస్థానీ కార్యకలాపాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన యూకే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల భారత్కు వచ్చిన ఆదేశ భద్రతా మంత్రి కూడా దీనిపై ప్రధానంగా చర్చలు జరిపారు. అనంతరం తీవ్రవాదంపై కలసికట్టు పోరుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన బ్రిటన్.. అక్కడ ఖలిస్థానీ తీవ్రవాదం నిరోధానికి ప్రత్యేకంగా 95,000 పౌండ్లు(కోటి రూపాయలు) కూడా కేటాయిస్తున్నట్లు ఆగస్టులో వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి..
అగ్రరాజ్యం అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి ఫ్రాంక్ టైసన్ (53) అనే ఆఫ్రో-అమెరికన్ ప్రాణాలు కోల్పోయాడు. -
జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు
ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. -
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదన
రఫాపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్ తెలిపింది. -
బ్రెజిల్లోని హోటల్లో అగ్నిప్రమాదం
దక్షిణ బ్రెజిల్లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. -
చిత్రవార్త
-
అమెరికా డ్రోన్ను కూల్చిన హూతీలు
ఎర్రసముద్రం మళ్లీ వేడెక్కింది. హూతీ వేర్పాటువాదులు దూకుడు పెంచారు. బాలిస్టిక్ క్షిపణులతో బాబ్ ఎల్ మండేబ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలను భయపెడుతున్నారు. -
అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే ఓ రేడియో ఇంటర్వ్యూలో తెలిపారు. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఎస్యూవీ అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. -
కంబోడియా సైనిక స్థావరంలో పేలుడు
కంబోడియాలో ఓ సైనిక స్థావరంలో పేలుడు సంభవించి 20 మంది సైనికులు మృతి చెందారు. చాలా మందికి గాయాలయ్యాయి. -
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఒక దశలో ఒంటరితనాన్ని అనుభవించారట. చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
-
వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా