Zelenskyy: జెలెన్స్కీ ఖాకీ జాకెట్ వేలం.. ఎంతకు అమ్ముడుపోయిందంటే!
యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి! ఈ క్రమంలోనే మొదటి నుంచి అండగా నిలుస్తోన్న బ్రిటన్.. తాజాగా ఉక్రెనియన్ల మానవతా సాయం కోసం నిధుల సమీకరణకు నడుం బిగించింది...
ఇంటర్నెట్ డెస్క్: యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి! ఈ క్రమంలోనే మొదటి నుంచి అండగా నిలుస్తున్న బ్రిటన్.. తాజాగా ఉక్రెనియన్ల మానవతా సాయం కోసం నిధుల సమీకరణకు నడుం బిగించింది. ఈ మేరకు తాజాగా నిర్వహించిన ఓ దాతృత్వ వేలంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఖాకీ జాకెట్.. ఏకంగా రూ.85.46 లక్షల (90 వేల పౌండ్లు)కు అమ్ముడుపోవడం విశేషం. లండన్లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది.
రష్యా దండయాత్ర క్రమంలో.. జెలెన్స్కీ మొక్కవోని ధైర్యానికి ప్రశంసలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన తన ట్రేడ్మార్క్ గ్రీన్ మిలిటరీ దుస్తులకు ప్రసిద్ధి. ఖాకీ జాకెట్ ధరించి.. రాజధాని కీవ్లో పర్యటించిన చిత్రాలు పలు సందర్భాల్లో వైరల్ అయ్యాయి. వేలంలో ఈ జాకెట్ ప్రారంభ ధరను 50 వేల పౌండ్లుగా నిర్ణయించగా.. మరింత ఎక్కువకు కొనుగోలు చేయాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్కడున్నవారికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే భారీ ధరకు అమ్ముడుపోవడం గమనార్హం. బోరిస్ జాన్సన్ గతంలో జెలెన్స్కీతో కలిసి కీవ్ వీధుల్లో పర్యటించిన సందర్భంగా అందుకున్న కాకరెల్ జగ్ సహా అనేక వస్తువులనూ వేలంలో ఉంచారు. కీవ్ మేయర్ విటాలి క్లిట్ష్కోతో నగర సందర్శన ప్యాకేజీ కూడా ఈ జాబితాలో ఉంది.
‘మేయర్ క్లిట్ష్కోతో కలిసి కీవ్లో పర్యటించా. అదొక అందమైన నగరం. ఈ టూర్ కోసం వీలైనంత ఖర్చు చేయొచ్చు’ అని జాన్సన్.. వేలంలో పాల్గొన్నవారిని ఉత్సాహ పరిచారు. ఈ విపత్కర సమయంలో ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడం ద్వారా.. పురాతన యూరోపియన్ నగరం కీవ్కు మళ్లీ ఎప్పటికీ ముప్పు ఉండదని, ఆ దేశం మరోసారి స్వేచ్ఛగా మనగలుగుతుందని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ప్రజల స్ఫూర్తిని పుతిన్ ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేరని ప్రకటించారు. ఈ సందర్భంగానే.. బ్రిటన్ చేస్తున్న సాయానికి జెలెన్స్కీ బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. చివరి బ్యాచ్ స్వదేశానికి బయల్దేరినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి ఓ వార్తాసంస్థకు వెల్లడించారు. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది. -
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
వేర్పాటువాదానికి, హింసను సమర్థించేవారికి మద్దతు ఇవ్వడమనేది భావప్రకటన స్వేచ్ఛకు అర్థం కాదని కేంద్ర మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. -
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
వివాహ బంధంలో కొత్త ట్రెండ్ను ఫాలో అవుతోన్న జపాన్ యువత.. పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ ధోరణి వైపు అడుగులు వేస్తోంది. -
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
భారత ఎన్నికల విషయంలో తమ ప్రమేయం ఉండదని అమెరికా (USA) స్పష్టం చేసింది. రష్యా ఆరోపణలను ఖండించింది. -
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
ఫోరిడాలో పోలీసులు ఓ అపార్ట్మెంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ నల్లజాతీయుడు మృతి చెందడంతో అక్కడ నిరసన వ్యక్తమైంది. -
విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం
వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్, జెఫ్రీ హాటిన్లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. -
బోయింగ్ 737 విమానంలో మంటలు.. రన్వేపై జారి 10 మందికి గాయాలు
ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగి రన్వేపై జారిపోయింది. -
18 ఏళ్లకే ట్రంప్ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బ్యారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. -
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. -
రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. -
రఫాపై దాడి చేస్తే ఆయుధాలివ్వం
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. గాజాలోని ఈ నగరంపై దాడిచేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. -
భారత లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. రష్యా సంచలన ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర వెనక భారత వ్యక్తుల ప్రమేయం ఉందంటూ అమెరికా చేసిన ఆరోపణలను రష్యా తాజాగా తోసిపుచ్చింది. -
పాక్లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రావిన్స్లోని గ్వాదర్లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్ స్పష్టం చేసింది. -
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
పర్యటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాయల్ థాయ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్