Chiranjeevi: వెంకయ్యనాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి

హైదరాబాద్‌: పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరికి ఒకేసారి పద్మవిభూషణ్ పురస్కారం రావడంపై చిరంజీవి ఆనందం వ్యక్తంచేశారు. వెంకయ్యనాయుడు, చిరంజీవి ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. వెంకయ్యనాయుడితో గడిపిన ఈ క్షణాలు తనకెంతో ప్రత్యేకమన్న చిరంజీని.. పరస్పర అభినందన ఎల్లప్పుడు చిరస్మరణీయంగా ఉంటుందన్నారు. కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Published : 26 Jan 2024 23:04 IST

హైదరాబాద్‌: పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరికి ఒకేసారి పద్మవిభూషణ్ పురస్కారం రావడంపై చిరంజీవి ఆనందం వ్యక్తంచేశారు. వెంకయ్యనాయుడు, చిరంజీవి ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. వెంకయ్యనాయుడితో గడిపిన ఈ క్షణాలు తనకెంతో ప్రత్యేకమన్న చిరంజీని.. పరస్పర అభినందన ఎల్లప్పుడు చిరస్మరణీయంగా ఉంటుందన్నారు. కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

మరిన్ని