Crime News: మద్యం మత్తులో ఫ్లైఓవర్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
మద్యం మత్తులో ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వెల్డింగ్ షాపులో కార్మికుడిగా పని చేస్తున్న భూక్యా అశోక్.. ఓ మహిళను ప్రేమ వివాహం చేసుకొని, కోమటి బస్తీలో నివసిస్తున్నాడు. ప్రతి రోజు మద్యం సేవించి భార్యను కొడుతూ.. మత్తులో తాను చనిపోతానంటూ బెదిరిస్తుండేవాడు. సోమవారం కూడా మద్యం సేవించి భార్యను కొట్టాడు. ఆత్మహత్య చేసుకుంటానని ఇంటిలో నుంచి వెళ్లిన అశోక్.. మధ్యాహ్నం వేళ బాలానగర్ ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Published : 06 Jun 2023 13:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?